Pushpa 2: గత ఏడాది డిసెంబర్ మాసంలో రిలీజ్ అయిన “పుష్ప” దేశవిదేశాలలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ బన్నీ నటించిన ఈ సినిమాని పాన్ ఇండియా నేపథ్యంలో… రిలీజ్ చేయడం జరిగింది. కనీసం తెలుగులో తప్ప మిగతా భాషల్లో పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు చేయకుండానే .. రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా హిందీలో అయితే అక్కడి స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా “పుష్ప” మంచి పోటీ ఇచ్చి.. దాదాపు 100 కోట్ల మేర కలెక్షన్ హిందీ “పుష్ప” రాబట్టినట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో బన్నీ వేసిన స్టెప్పులు మరియు డైలాగులు.. సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు ఫుల్ ఫిదా అయ్యారు.
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇంకా చాలామంది ఇంటర్నేషనల్ క్రికెట్ సభ్యులు… పుష్ప డైలాగులు పాటలకి సోషల్ మీడియాలో వీడియో లు చేస్తూ … ట్రెండింగ్ గా నిలిచారు. ఇండియన్ స్టార్ క్రికెటర్ కోహ్లీ కూడా .. “పుష్ప” డైలాగులు మరియు తగ్గేదేలే బన్నీ మేనరిజం అందరూ చూస్తుండగానే మ్యాచ్ మధ్యలో గ్రౌండ్ లో కోహ్లీ చేయడం జరిగింది. దీంతో ఊహించని విధంగా దేశ విదేశాలలో పుష్ప మొదటిభాగం బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో… సెకండ్ పార్ట్ పుష్ప పై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ మాసం తర్వాత రెండో భాగం పుష్ప షూటింగ్ సినిమా యూనిట్ స్టార్ట్ చేయనుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి సెకండ్ పార్ట్ పాటలకి దేవిశ్రీప్రసాద్ అప్పుడే… రెండు పాటలు రెడీ చేసినట్లు సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం. “పుష్ప” ఫస్ట్ పార్ట్ లో పాటలు… సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఐటెం సాంగ్ “ఉ అంటావా…. ఊఊ అంటావా” అనే పాట.. శ్రీవల్లి సాంగ్.. ఫన్నీ స్టెప్పులు దేశం మొత్తం హైలెట్ గా నిలిచాయి. ఈ తరుణంలో “పుష్ప” సెకండ్ పార్ట్ పాటలు విషయంలో.. దేవి శ్రీ ప్రసాద్ .. మొదటి భాగం కంటే మరింత గా ఇవ్వాలని ఎక్కువ టైం తీసుకుని సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకుండానే అప్పుడే రెండు పాటలు కంప్లీట్ చేయడం జరిగిందట. పుష్ప మొదటి భాగం షూటింగ్ జరుగుతున్న సమయంలో సినిమా మొత్తం కంప్లీట్ అవ్వకుండానే అప్పట్లోనే దేవిశ్రీప్రసాద్ ఆరు పాటలు ఇచ్చాడు. ఇప్పుడు ఇదే మాదిరి సెకండ్ పార్ట్ లో కూడా దేవి శ్రీ ప్రసాద్.. మంచి స్పీడ్ మీద ఉన్నట్లు తెలుస్తోంది.
Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!