INDIA Alliance: పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్ పై ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ పై ఇటీవల జరిగిన దాడి పై కేంద్ర హోంమంత్రి, ప్రధాన మంత్రి వివరణ ఇవ్వాలని విపక్షాలు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన కొనసాగించాయి. వీరి డిమాండ్ ను అంగీకరించని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా విపక్ష సభ్యుల్లో అత్యధిక మందిని సస్పెండ్ చేశారు.
మునుపెన్నడూ లేని విధంగా గత కొద్ది రోజులుగా ఉభయ సభల్లో 92 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ కు గురయ్యారు. రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు ఎక్కువ మంది సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ పరిణామాల క్రమంలో ఇండియా కూటమి పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించింది. లోక్ సభ, రాజ్యసభ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించింది. సభ్యుల సస్పెన్షన్లకు నిరసనగా పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాలని ఇండియా కూటమి నిర్ణయించింది.
మరో పక్క ఇవేళ ఇండియా కూటమి సమావేశం అవుతోంది. ఇండియా కూటమి భేటీ కావడం ఇదే నాల్గో సారి. ఢిల్లీలో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రతిపక్ష నేతలంతా హజరుకానున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల తర్వాత జరుగుతున్న భేటీ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కీలక అంశాలపై కూటమి సభ్యులు చర్చించనున్నారు.
లోక్ సభ ఎన్నికలకు మరో 90 రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమి లో చర్చించనున్నారు. ఇప్పటికే ఇండియా కూటమి సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు .. ముస్లిం సంఘాల పిటీషన్లు డిస్మిస్