Mahesh Babu: ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా స్టార్ట్ కాబోతున్న సంగతి తెలిసిందే. “SSMB 29” వర్కింగ్ టైటిల్ పేరిట ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. “RRR”తో ప్రపంచ స్థాయిలో విజయం సాధించిన.. రాజమౌళి నెక్స్ట్ మహేష్ బాబు ప్రాజెక్టు కూడా అదే స్థాయిలో ఉండే విధంగా జాగ్రత్తలు వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏకంగా వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. పాన్ వరల్డ్ తరహాలో ఈ సినిమాని జక్కన్న చిత్రీకరించనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి జర్మనీ వంటి అడవులలో మహేష్ బాబు పర్యటించడం జరిగింది.
“ఇండియానా జోన్స్” సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తరహాలో.. ఈ సినిమా తీయబోతున్నట్లు సమాచారం. దీంతో జర్మనీ వంటి దేశాలలో..ఉన్న అడవులలో ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ జరుపుకోనుందట. ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు ఊహించని విధంగా.. యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉండనున్నట్లు సమాచారం. ప్రతి ప్రాజెక్టు స్టార్ట్ చేసే ముందు మీడియా సమావేశం పెట్టడం రాజమౌళి అలవాటు. ఈ సినిమాకి కూడా అదే రీతిలో..ప్లాన్ చేశారు. కాకపోతే జాతీయ స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు సమాచారం.
ఈ కార్యక్రమానికి వరల్డ్ బెస్ట్ టాప్ మోస్ట్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారట. గత ఏడాది ఆస్కార్ అవార్డ్స్ సందర్భంగా కెమెరూన్ మరియు రాజమౌళి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ సమయంలో మీడియం ముందు రాజమౌళితో కలిసి పనిచేయాలని తనకి ఉందని.. కామరూన్ కామెంట్లు చేశారు. కాగా ఇప్పుడు మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి జేమ్స్ కామెరూన్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి మ్యూజిక్ సెట్టింగ్స్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సమ్మర్ నుండే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని రాజమౌళి భావిస్తున్నారు.