టీడీపీలో టకెట్ల రగడ ఓ రేంజ్లో సాగుతోంది. తమకు కాదని.. తమను సంప్రదించకుండా టికెట్లు ఇచ్చా రని భావిస్తున్నతమ్ముళ్లు రోడ్డున పడుతున్నారు. కొన్ని చోట్ల నాయకులు ఇంటికే పరిమితమైతే.. మరికొ న్ని నియోజకవర్గాల్లో మాత్రం.. నాయకులు హెచ్చరికలు, బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా.. ఉమ్మ డి అనంతపురం జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం శింగనమల వ్యవహారం టీడీపీకి సెగ పెడుతోంది. మరో వైపు.. పి. గన్నవరం విషయం ఇంకా చల్లబడలేదు. ఇలా.. సుమారు 5 నుంచి 8 నియోజకవర్గాల్లో తమ్ము ళ్లు తర్జన భర్జన పడుతున్నారు.
చిత్రం ఏంటంటే.. టికెట్ ఆశించినవారి పరిస్థితి కంటే.. వారి అనుచరుల రగడ ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా వెలుగు చూసిన శింగనమల వ్యవహారంలో.. ఎస్సీ నియోజకవర్గంలో రెడ్డి నేతలు.. టీడీపీకి సెగ పెడుతున్నారు. ఇక్కడి టికెట్ను గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బండారు శ్రావణికి చంద్రబాబు మరోసారి అవకాశం ఇచ్చారు. గత ఏడాది నిర్వహించిన యవగళం పాదయాత్రలో బండారు శ్రావణి దూకుడగా పాల్గొంది. భారీ ఎత్తున అనుచరులను తీసుకువచ్చి.. ఫండింగ్ కూడా చేసింది.
ఈ క్రమంలోనే అప్పట్లో నారా లోకేష్ ఆమెకు అభయం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనో.. లేక చంద్రబాబు చెబుతున్న ఐవీఆర్ ఎస్ సర్వే కారణమో తెలియదు కానీ.. మొత్తానికి శ్రావణికి టికెట్ ఇచ్చారు. కానీ, ఆ తర్వాత నుంచి ఇక్కడ వ్యతిరేకత పెరిగిపోయింది. బండారు శ్రావణికి టికెట్ ఇవ్వొద్దని, వేరే వ్యక్తిని ప్రకటించాలని కేశవరెడ్డి అనే సీనియర్ నాయకుడు డిమాండ్ చేస్తున్నారు. బండారుకు వ్యతిరేకంగా ఆయన కూటములు కట్టారు. ఆమెకు టికెట్ ఇస్తే.. ఓడిస్తామని తాజాగా తేల్చి చెప్పారు.
మాకు ఉపయోగపడే నాయకులు కావాలి. గత ఎన్నికల్లో ఏదో గెలుస్తుందని మేం సపోర్టు చేశాం. గత నాలుగేళ్లుగా ఆమె మాకు ముఖం కూడా చూపించలేదు. యువగళం నాలుగు రోజులు పాల్గొంటే సింపతీ వచ్చేస్తుంది. క్షేత్రస్థాయిలో శ్రావణికి ఉన్న బలం ఎంత? ఏమీ లేదు. ఆమెను ఓడించేందుకు సొంత పార్టీ కార్యకర్తలే రెడీగా ఉన్నారు. అందుకే ఆమెను తొలగించాలని చెబుతున్నారు. ఆమె వెనుక ఎవరున్నారో మాకు తెలుసు. ఆ కుటుంబానికే టికెట్లు కట్ అయిపోయాయి అనికేశవ రెడ్డి అంతర్గత సమావేశాల్లో తేల్చి చెబుతున్నారు. ఇక్కడ బలమైన నేతగా ఉన్న కేశవరెడ్డివెంటే రెడ్డి వర్గం ఉండడం గమనార్హం.