ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రజల వద్దకు వెళుతున్నాయి. ఏ ఒక్క ఛాన్స్ వదులుకోకుండా… జనాల్లోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. కంటికి నిద్ర లేకుండా లీడర్లు పనిచేస్తున్నారు. మరోసారి ఏపీలో అధికారంలో వచ్చేందుకు వైసిపి పార్టీ… ఎలాగైనా జగన్ మోహన్ రెడ్డిని ఓడించేందుకు కూటమి పార్టీలు ఏకమయ్యాయి.
ఇలాంటి నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని బాగా పాపులర్ అయిన కుమారి ఆంటీ… ఆయనకే వెన్నుపోటు పొడిచింది. రాజకీయాలలోకి రాకముందే.. పక్కా పొలిటిషన్ లాగా… వ్యవహరిస్తోంది కుమారి ఆంటీ. కుమారి ఆంటీ గురించి అందరికీ తెలిసిందే. హైటెక్ సిటీ లోని ఇన్ ఆర్బిట్ మాల్ దగ్గర ఫుడ్ కోర్టు పెట్టుకొని… తన మాటలతో బాగా పాపులర్ అయింది కుమారి ఆంటీ.
తక్కువ ధరకే ఆహారాన్ని జనాలకు అందిస్తూ… బాగానే సంపాదించింది. అయితే యూట్యూబ్ పుణ్యమా అంటూ… ఒకసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ కుమారి ఆంటీ. అంతేకాకుండా జగన్ మోహన్ రెడ్డి వల్ల తనకు ఇల్లు వచ్చిందని గతంలో ఇంటర్వ్యూలో కూడా కుమారి ఆంటీ చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయాన్ని వైసిపి సోషల్ మీడియా తెగ ప్రచారం చేసింది. హైదరాబాదులో ఉంటున్న కుమారి ఆంటీ కి కూడా జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇచ్చాడని డబ్బా కొట్టుకుంది వైసిపి.
అయితే అలాంటి వైసిపి పార్టీకి తాజాగా కుమారి ఆంటీ వెన్నుపోటు పొడిచింది. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ కోసం పని చేసింది కుమారి ఆంటీ. ఎన్నికల ప్రచారంలో కుమారి ఆంటీ మెరిశారు. గుడివాడలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేను గండ్ల రాము తరఫున ప్రచారం చేశారు. 15 సంవత్సరాల కిందట గుడివాడ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని… ఇక్కడ అవకాశాలు లేకపోవడంతో నాలాంటివారు పక్క రాష్ట్రానికి వెళ్తున్నారని ఈ సందర్భంగా కుమారి ఆంటీ ప్రచారం చేశారు.
గుడివాడలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామును గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని… కొడాలి నానిని ఓడించాలంటూ ప్రచారం చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే దీనిపై వైసీపీ సోషల్ మీడియా ఇప్పటివరకు స్పందించలేదు. మొత్తానికి కుమారి ఆంటీ పక్క కమర్షియల్ అని… జగన్మోహన్ రెడ్డి ఇల్లు తీసుకొని… టిడిపికి ప్రచారం చేస్తుందని కొంతమంది కామెంట్స్ మాత్రం చేస్తున్నారు.