తెలుగు దేశం పార్టీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తరచుగా రెడ్ బుక్-రెడ్ బుక్.. అంటూ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. కొంత మంది అధికారులు టీడీపీ నాయకులపైనా.. తనపైనా దాడు లు చేస్తున్నారని.. వైసీపీ ప్రభుత్వం చెప్పినట్టే వారు ఆడుతున్నారని.. ఇలాంటి వారి పేర్లు తన రెడ్ బుక్లో రాస్తున్నానని.. గతంలో పాదయాత్ర సమయంలోనూ.. తర్వాత కూడా.. నారా లోకేష్ చెప్పుకొచ్చారు.
యువగళం పాదయాత్ర సమయంలో పెద్ద ఎత్తున ఇలాంటి వ్యాఖ్యలు ఆయన చేశారు. అనంతర కాలంలో నిర్వహించిన సభల్లోనూ.. ప్రచారంలోనూ కూడా నారా లోకేష్.. రెడ్బుక్ పేరును వాడారు. వీరిని వదిలేది లేదన్నారు. దీనిపై తర్వాత కాలంలో పెద్ద ఎత్తున దుమారం కూడా రేగింది. అంతేకాదు.. ఏపీ సీఐడీ అధికా రులు తమను బెదిరిస్తున్నారంటూ.. హైకోర్టులో కేసులు కూడా వేశారు. దీనిపై కొన్నాళ్లు విచారణ కూడా సాగింది.
అయితే.. ఇప్పుడు మరోసారి రెడ్బుక్ వ్యవహారం టీడీపీలో చర్చకు దారి తీసింది. ఎందుకంటే.. గత కొన్ని రోజులుగా ఏపీలో ఐపీఎస్ అధికారులు వరుస పెట్టి లేచిపోతున్నారు. స్థానాలు మారిపోతున్నాయి. ఎన్నికల విధులకు దూరమవుతున్నారు. వారిని ఉన్నపళంగా ఆయా స్థానాల నుంచి మార్చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిప్పులు చెరుగుతోంది. దీంతో ఇప్పటికి 12 మంది ఐపీఎస్ అధికారులను మార్చేశారు. వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచారు.
ఇక, కీలకమైన డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని కూడా ఎన్నికల సంఘం ఉన్న పళాన సీటును ఖాళీ చేయిం చింది. ఆయన స్తానంలో గుప్తా నియమితులయ్యారు. మొత్తంగా చూస్తే.. ఇలా.. పెద్ద తలకాయలు ఎన్నిక లకు ముందు జరిగిపోవడం.. నారా లోకేష్ రెడ్బుక్ లో పేరున్న వారే(ఆయన చెప్పలేదు. టీడీపీ నేతలు భావిస్తున్నారు) కావడంతో.. ప్రస్తుతం మరోసారి రెడ్ బుక్ వ్యవహారం.. చర్చకు వచ్చింది.