Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. వారిలో యాంకర్ శ్యామల కూడా ఒకరు. మొదటిగా సీరియల్ యాక్టర్ గా తన కెరీర్ను ప్రారంభించిన ఈ బ్యూటీ అనంతరం యాంకర్ గా మరియు సినిమాలలో సపోర్టు రోల్స్ లో నటించింది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ యాంకరింగ్ కి దూరమైంది శ్యామల. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి ఏ విధంగా ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా సినీ సెలబ్రిటీలు సైతం తాము ఎంతగానో గౌరవించే పార్టీస్ కి మద్దతుగా నిలుస్తున్నారు.
ఈ క్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీలు జనసేనకి సపోర్ట్ చేస్తుంటే వారికి భిన్నంగా యాంకర్ శ్యామల మాత్రం వైఎస్ఆర్సిపి కి సపోర్ట్ గా నిలబడింది. అంతేకాకుండా రాజకీయం పరంగా ఘాటు వ్యాఖ్యలను కూడా చేస్తుంది. ఇక లెజెండ్ మూవీలో బాలయ్య ఒక డైలాగ్ చెబుతాడు. రాజకీయం బై బర్త్ నా బ్లడ్ లోనే ఉందని. ఏపీలో ఎలక్షన్స్ ముంచుకొస్తున్న వేళ ఇప్పుడు ఈ డైలాగ్ కొంతమంది సినిమా వాళ్లకి సూట్ అవుతుంది. రాజకీయాల్లో అసలు ఎప్పుడూ కనపడని వారు సీనియర్ మోస్ట్ పొలిటిషన్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలని చూస్తుంటే ప్యాకేజీ వచ్చిందనే విషయం అర్థమవుతుంది. ఈ కోవాలో తాజాగా చేరిన నటి యాంకర్ శ్యామల. ఈమె గురించి పృథ్వీ చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. యాంకర్ శ్యామల సినిమా మరియు ఈవెంట్స్ కి యాంకరింగ్ చేస్తూ పలు సినిమాస్లో నటిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సీరియల్స్ లో కూడా కనిపిస్తుంది.
ఇక తాజాగా ఆమె మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అభ్యర్థుడు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి గుంట నక్క, మొసలి తోడేళ్లు అని కొన్ని వ్యాఖ్యలను చేసింది. ఇక తాజాగా ఈమె మాటలకి నటుడు పృథ్వీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. సినిమాలలో కామెడీ రోల్స్ లో ప్లే చేసే పృథ్వి పాలిటిక్స్ పరంగా కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. సినిమాలలో కమీడియన్ అయినప్పటికీ పాలిటిక్స్ లో మాత్రం హీరో అనే చెప్పుకోచ్చు. సినీ ఇండస్ట్రీ నుంచి పోటీలో నిలబడ్డ పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతూ ప్రచారం చేపట్టారు పృథ్వి. ఇక తాజాగా ఈయన శ్యామలపై స్పందిస్తూ..” లౌక్యంలో శ్యామల నాతో పాటు చేసింది. ఆమె పవన్ కళ్యాణ్ ని మరియు చంద్రబాబుని తిడుతుంది. వచ్చాయమ్మా నిన్ను అయిదు నిమిషాల్లో పంపించేస్తా అని మాట్లాడిన అవంతి శ్రీనివాస్ ని పక్కన పెట్టుకుని తిడుతుంది. పైన విశాఖపట్నం సుందరంగా ఉందని చెప్తుంది.
మరి ఆమెకి ఇచ్చిన పేమెంట్ లో విశాఖపట్నం గురించి కొంచెం ఎక్కువ చెప్పామని అన్నారేమో. కానీ శ్యామలకి తెలియని విషయం ఏమిటంటే వైజాగ్ ప్రజలు నువ్వు కనిపిస్తే చెప్పులతో కొట్టాలి అనే ఊసులో ఉన్నారు. రోజు కూడా గతంలో దరిద్రుడు జైలుకి పోతే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేస్తున్నాడని మాట్లాడింది. వేల వరసలన్నీ ఓకే రకంగా ఉంటాయి. కొంచెం కొంచెం మార్చుతుంటారు అంతే. నేను నా వైఫ్ జనసేన వేరా మహిళలు కలిసి ప్రతి ఏరియా తిరుగుతున్నాం. ప్రతి చోటా అపరిశుభ్రం వాతావరణం.. క్లీన్ నెస్ అనేదే లేదు. అడుగు పెట్టలేని విధంగా ఉంది ” అంటూ శ్యామల వ్యాఖ్యలపై స్పందించాడు పృథ్వీ . ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.