కృతి శెట్టి.. టాలీవుడ్లో మారుమోగిపోతున్న పేరు ఇది. `ఉప్పెన` మూవీతో బేబమ్మగా ప్రేక్షకులను పలకరించి.. తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత `శ్యామ్ సింగరాయ్`, `బంగార్రాజు` చిత్రాలతో మరో రెండు హిట్లు అందుకున్న కృతి శెట్టి.. రీసెంట్గా `ది వారియర్`తో ప్రేక్షకులను పలకరించింది.
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కోలీవుడ్ డైరెక్టర్ ఎన్. లింగుసామి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న మాస్ ఎంటర్టైనర్ మూవీ ఇది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి ఈ మూవీని నిర్మించారు. జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ బోల్తా ఘోరంగా బోల్తా పడింది. ఇదిలా ఉంటే.. కృతి శెట్టికి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. కృతి శెట్టికి ఓ గమ్మత్తైన సెంటిమెంట్ ఉంటుంది. అదేంటంటే.. తను నటించిన ప్రతి సినిమా లోనూ హీరోతో కలిసి బైక్ పై షికారు కు వెళ్లే సీన్ ఉండాలట. ఆ సీన్ ఉంటేనే సినిమాకు సైన్ చేస్తుందట. ఇప్పటి వరకు నటించిన ప్రతీ సినిమాలో ఈ సీన్ తప్పనిసరిగా ఉండేట్టు చూసుకుంటూ వచ్చిన కృతి శెట్టి.. ఇక ముందు కూడా బైక్ సీన్ ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకుంటుందట.
బైక్ సీన్ తనకు సెంటిమెంట్ అని.. సినిమా హిట్టైనా, ఫ్లాపైనా దాన్ని ఆమె ఫాలో అవుతుందని టాక్ నడుస్తోంది. కాగా, ఈమె సినిమాల విషయానికి వస్తే.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో అలరించబోతోంది. అలాగే సుధీర్ బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` అనే సినిమా చేస్తోంది. వీటితో పాటు తమిళ స్టార్ హీరో సూర్యకు జోడీగా `అచలుడు` మూవీలో నటిస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?