సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా చాలా మంది సామాన్యులు సెలబ్రిటీగా మారిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా ప్రస్తుతం రాణిస్తున్న హైపర్ ఆది ఒకప్పుడు ఫేస్ బుక్ లో క్రేజ్ సంపాదించి ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగానే టిక్ టాక్ ద్వారా విపరీతంగా ఇటీవల క్రేజ్ తెచ్చుకున్న వ్యక్తి దుర్గారావు దంపతులు. ఇద్దరూ తమ ఇంటిలోనే అందుబాటులో ఉన్న సదుపాయాలతో టిక్ టాక్ వీడియోలు చేసి అనేక పాటలకు స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు.
దీంతో వీరిపై ఈ టీవీ యాజమాన్యం కనపడటంతో వెన్నుతట్టి ప్రోత్సహించే డానికి సుడిగాలి సుధీర్ ముందుకు రావటం జరిగింది. టిక్ టాక్ ముసేనాటికి వీళ్ళకి కొన్ని మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అటువంటిది వీరు “నాది నక్లెస్ గొలుసు” అనే పాటతో బాగా పాపులర్ అయ్యారు. ఇదిలా ఉండగా ఈ దంపతులను సుడిగాలి సుదీర్ జబర్దస్త్ షో లో తీసుకురావటానికి ప్రత్యేకంగా దుర్గారావు ఇంటికి కారు పంపించి మరి హైదరాబాద్ కి వచ్చేలా చేశారు.
ఆ తర్వాత జబర్దస్త్ హైపర్ ఆది స్కిట్ లో దుర్గారావు దంపతులు కనిపించి సందడి చేశారు. ఈ స్కిట్ ప్రోమో చూసి అప్పట్లో చాలామంది ఇంకా దుర్గారావు తలరాత మారిపోయినట్లే అని భావించారు. తీరా స్కిట్ లో ప్రోమో లో చూపించిన రీతిగానే దుర్గారావుకి స్టేజిపై హైపర్ ఆది అవకాశం జరిగింది. అంతగా దుర్గారావు కి ఛాన్స్ ఇవ్వకుండా తన పంచ్ డైలాగులతో యధావిధిగా కానీచేశాడు. మొత్తంమీద స్టేజిపై అరనిమిషం పాటు మాత్రమే దుర్గారావు నిలబడటం జరిగింది. ఈ పరిణామంతో సోషల్ మీడియాలో దుర్గారావు ఫ్యాన్స్ హైపర్ ఆది చేసిన పనికి ఉమ్మడి పోతున్నారట. ఇది కేవలం దుర్గారావు క్రేజ్ అడ్డం పెట్టుకుని హైపర్ ఆది తన స్కిట్ కి పాపులారిటీ తెచ్చుకోవడమే అని మండిపడుతున్నారట.
దీంతో ఎన్నో ఆశలు పెట్టుకుని వెళ్ళిన దుర్గారావు కి పెద్దగా అవకాశం రాకపోవడంతో తిరిగివచ్చే టంతో హైపర్ ఆది చేసిన పనికి కుమలి పోతున్నరట. అరనిమిషం కోసం అనవసరంగా ఊర్లో పనులు మానుకుని వెళ్ళినట్లు దుర్గారావు దంపతులు బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ తర్వాత “డీ” లో అవకాశం ఉంటుందని మిగతావాళ్లు చెప్పిన గాని దుర్గారావు దంపతులు ఆ మాటలు పట్టించుకోకుండా తిరిగి తమ సొంత ఊరికి వచ్చేసినట్లు టాక్. కావాలని “జబర్దస్త్” లో అదేవిధంగా “డి” లో దుర్గారావు రాకుండా తెర వెనకాల కుట్రలు జరిగినట్లు దుర్గారావు అభిమానులు భావిస్తున్నారు.