ప్రస్తుతం కరోనా మహమ్మారి రెండవసారి విజృంభించడానికి రెడీ అవుతున్న తరుణంలో ప్రపంచమంతా వ్యాక్సిన్ పైనే నమ్మకం పెట్టుకుంది. వచ్చే రెండు నెలల్లో పరిస్థితి మెరుగుపడుతుందని… వ్యాక్సిన్ అందరికీ లభిస్తుందని ఆశావహంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ తయారీపై కొన్ని పుకార్లు చెలరేగాయి…
వ్యాక్సిన్ లో పంది మాంసం…
వివరాల్లోకి వెళితే… కరోనా వ్యాక్సిన్ తయారీలో అవాంఛనీయమైన పదార్థాలను వినియోగించారు అంటూ కొత్త పుకార్లు బయటికి వచ్చాయి. దీంతో ఈ వ్యాక్సిన్ తీసుకునేందుకు కొన్ని దేశాలు సంశాయించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఒక్కో వ్యాక్సిన్… ఒక్కో చోట వాడుకకు సిద్ధం అవుతున్న సమయంలో ఇందులో పంది మాంసం కలిపారని మొదలైన ప్రచారాన్ని ఒక వర్గం వ్యతిరేకిస్తుంది. పంది మాంసంతో చేసిన ఉత్పత్తులు వాడితే తమ మత సంప్రదాయాలకు విరుద్ధమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలు ఇస్లామిక్ దేశాలు వ్యాక్సిన్ కొనుగోలుకు తర్జనభర్జనలు పడుతున్నాయని సమాచారం.
ఇదే ప్రాబ్లం…
మరింత లోతుగా వెళితే… వ్యాక్సిన్ జీవితకాలం పెంచడానికి, మందును సురక్షితంగా సమర్థవంతంగా ఉండడానికి పంది మాంసంతో చేసిన జెలాటిన్ ను వాడుతుంటారు. ఇప్పుడు దీనినీ కారణంగా చూపుతూ పలు ముస్లిం దేశాలు వ్యాక్సిన్ వాడేందుకు అభ్యంతరం చేస్తున్నాయట. ఇస్లాంలో పందిని అపవిత్ర జంతువుగా చూస్తారు. అయితే పలు ముస్లిం పెద్దలు మాత్రం వ్యాక్సిన్ లకు మతంతో సంబంధం లేదని… దీనిని అందరూ తీసుకోవాల్సిందే అని చెబుతున్నారు. మతం కన్నా మనిషి ప్రాణమే ముఖ్యమని గుర్తు చేస్తున్నారు. పోలియో వ్యాక్సిన్ సందర్భంగా కూడా ఇస్లామిక్ సెంటర్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిందని… ఇప్పుడు అదే చేస్తామని అంటున్నారు పలువురు.
వారు ఏం చెబుతున్నారంటే…
ఇంకా కరెక్టుగా చెప్పాలంటే… మనిషి ప్రాణాలను కాపాడేందుకు హరామ్ (అపవిత్రమైన) పదార్థాలను వాడటం తప్పేమీ కాదని గ్రంథాలు కూడా చెబుతున్నాయని పలువురు పెద్దలు అంటున్నారు. పంది మాంసం పేరు చెబుతూ వ్యాక్సిన్ తీసుకోవద్దు అని పలువురు చేస్తున్న ప్రచారాలను నమ్మవద్దని ఇస్లాం మతాన్ని పాటించే వారంతా తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ కు చెందిన మత పెద్ద మౌలానా ఖాలిద్ రషీద్ ఫిరంగి మహాలే పిలుపునిచ్చారు. యూదు మత పెద్దలు ఇదే మాట అనడం గమనార్హం.