అమరావతి:వైసిపి తరపున పోటీ చేసిన లోక్సభ,అసెంబ్లీ అభ్యర్థులతో ఈ నెల 21న పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
రాజధాని అమరావతి ప్రాంతంలో తాడేవల్లిలో ఎన్నికల ముందు ప్రారంభించిన పార్టీ కార్యాలయంంలో నిర్వహించే ఈ సమావేశానికి హాజరుకావాలని పార్టీ నేతలకు సమాచారం ఇచ్చిన్నట్లు తెలుస్తోంది.
పోలింగ్ ముగిసిన తరువాత మొదటిసారి పార్టీ అభ్యర్థులతో జగన్ భేటి అవ్వనున్నారు.
23వ తేదీన ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్ధులతో జగన్ భేటీ జరపడం ప్రాధాన్యత సంతరించుకపంది.