ఢిల్లీ: సార్వత్రిక సమరం ముగింపు దశకు చేరుకుంది. ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్సభ స్థానాలకు ఆదివారం పోలింగ్ ప్రారంభం అయ్యింది.
ఇప్పటి వరకు ఐదు దశల్లో మొత్తం 424 స్థానాల్లో పోలింగ్ ముగియగా.. 19న అఖరి దశలో మరో 59 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి.
నేడు ఆరో దశలో ఉత్తరప్రదేశ్లోని 14, హర్యానాలోని పది, పశ్చిమ బెంగాల్లోని ఎనిమిది, బీహార్లో ఎనిమిది, మధ్యప్రదేశ్లో ఎనిమిది, దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం ఏడు, జార్కండ్లో నాలుగు లోక్సభ నియోజకవర్గాలల్లో పోలింగ్ ప్రారంభం అయ్యింది.
ఉదయం ఏడు గంటలకు ప్రారంభం అయిన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకూ కొనసాగుతుంది.
పెద్ద సంఖ్యలో ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పలు పోలింగ్ కేంద్రాల్లో ఇవిఎంలు మోరాయించడంతో ఆ కేంద్రాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
ఎన్నికలు జరగనున్న ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గంలో రెండు జాతీయ పార్టీలకు చెందిన రాష్ట్ర అధ్యక్షులు షీలా దీక్షిత్, మనోజ్ తివారీ హోరాహోరీగా తల పడుతుండగా..
భోపాల్లో.. దిగ్విజయ్ సింగ్, ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు.
వీరితో పాటు మేనకా గాంధీ, అఖిలేశ్, జ్యోతిరాదిత్య వంటి ప్రముఖులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
పశ్చిమ త్రిపుర నియోజకవర్గంలోని 128వ కేంద్రాల్లో రీ-పోలింగ్ జరుగుతోంది.
పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున కేంద్ర బలగాలతో బందోబస్తు చర్యలు చేపట్టారు.