NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS Manifesto: తెలంగాణలో కేసిఆర్ ఫించన్ల పెంపు హామీలో జగన్ మార్క్

BRS Manifesto: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా హామీలను ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్. ఆదివారం కేసిఆర్ మీడియా సమావేశంలో ఎన్నికల హామీలను వెల్లడించారు. తమ పార్టీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనేక ప్రజాకర్షక హామీలను ప్రకటించారు. తాము మూడో సారి అధికారంలోకి వస్తే ప్రస్తుత పథకాలను కొనసాగించడంతో పాటు కొత్త హామీలను ఆరు నెలల్లోనే అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం దాన్ని పేదలకు పంచడమనే విధానంతోనే తొలి నుండి తమ ప్రభుత్వం వ్యవహరిస్తొందని అన్నారు. గత ఎన్నికల ప్రణాళికలో చెప్పని పథకాలను సైతం అమలు చేసిన ఘనత తమదేనని అన్నారు.

ఆసరా పెన్షన్ ను రూ.5వేలకు పెంచుతామని ప్రకటించిన కేసిఆర్ .. ఏపీలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అమలు చేసిన పింఛనల పెంపు విధానాన్ని ప్రశంసించారు. తమతో పాటు 2వేల పింఛను ఇచ్చిన జగన్ సర్కార్ ఏటా రూ.200 పెంచుతూ రూ.3వేలు చేసిందన్నారు. ఈ విధానం వల్ల ప్రభుత్వంపై ఒకే సారి భారం పడదని అన్నారు. అలానే తెలంగాణలోనూ తొలి సంవత్సరం రూ.3,016లకు పెంచుతామనీ, ఆ తర్వాత ఏటా రూ.500లు చొప్పున పెంచుతూ అయిదేళ్లలో రూ.5,016ల వరకూ పెంచుతామని ప్రకటించారు. అదే విధంగా దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు పెంపు చేస్తామని చెప్పారు. దివ్యాంగుల పింఛన్ తొలి ఏడాది రూ.5వేలకు పెంచి ఆ తర్వాత ఏటా రూ.300లు చొప్పున పెంచుతామని తెలిపారు.

ఇతర హామీలు ఇవి

  • రైతుబంధు, దళిత బంధును కొనసాగిస్తాం.
  • రైతు బంధును రూ.16వేల చేస్తాం.
  • సౌభాగ్యలక్ష్మి పథకం పేరిట అర్హులైన మహిళలకు నెలకు రూ.3000 భృతి
  • తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ
  • కేసిఆర్ భీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది
  • గిరిజనులకు పోడు పట్టాల కార్యక్రమం కొనసాగుతుంది.
  • గిరిజనులకు మరిన్ని సంక్షేమ పథకాలు తెస్తాం
  • తండాలు, గొండుగూడెలను పంచాయతీలుగా చేస్తాం
  • బీసీలకు అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తాం
  • రైతు భీమా తరహాలోనే పేదలకు కేసిఆర్ భీమా పథకం
  • తెల్లరేషన్ కార్డుదారులకు రూ.5లక్షల కేసిఆర్ భీమా
  • అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్ట్ లకు రూ.400లకే గ్యాస్ సిలెండర్, ఉద్యోగుల తరహాలో జర్నలిస్ట్ లకు కేసిఆర్ ఆరోగ్య రక్ష పేరుతో రూ.15లక్షల వరకు ఆరోగ్య భీమా.
  • తెలంగాణలో 93 లక్షలపైగా కుటుంబాలకు కేసిఆర్ భీమా.. ప్రతి ఇంటికి ధీమా పథకం, రూ.5లక్షల భీమా కల్పిస్తాం.
  • ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలకు పెంచుతాం.
  • అగ్రవర్ణాల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక గురుకుల పాఠశాల
  • మహిళా సంఘాలకు స్వశక్తి భవనాలు
  • రాష్ట్రంలో అనాధల కోసం ప్రత్యేక పాలసీ
  • ప్రభుత్వ ఉద్యోగుల ఓపీఎస్ కోసం కమిటీ ఏర్పాటు

T Congress: మూడు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవం .. కానీ ఆ సీనియర్ నేతకు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్ .. ఎందుకంటే..?

 

Related posts

ఫ‌స్ట్ టైం నంద‌మూరి కుటుంబం ఇలా చేసిందా…?

చివ‌రి కోరిక తీరుతుందా.. ఏపీలో కురువృద్ధుల‌కు టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌..!

టీడీపీ ఆశ‌ల‌న్నీ… ఈ ఓట్ల‌పైనే.. ఏం జ‌రుగుతుందో..!

YSRCP: ‘సజ్జల’పై కేసు నమోదు

sharma somaraju

ఆ మంత్రి గెలుపు ఆశ‌లు వ‌దులుకున్నారా… వైసీపీలో ఒక్క‌టే చ‌ర్చ‌..!

Prajwal Revanna: బెంగళూరులో ఫ్లైట్ దిగిన మరుక్షణమే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేసిన సిట్ పోలీసులు

sharma somaraju

ఏపీ ఉద్యోగులు రెచ్చిపోయారు.. జ‌గ‌న్‌కు ఎఫెక్టేనా..!

PS AB Venkateswararao: ఏపీ సీఎస్ ను కలిసిన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు .. పోస్టింగ్ కోసం వినతి

sharma somaraju

YSRCP: ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుపై మరోసారి స్పందించిన సీఎం జగన్

sharma somaraju

AP Election 2024: కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే జైలుకే: సీఈవో ముకేష్ కుమార్ మీనా

sharma somaraju

KTR: రాజకీయ కక్షతోనే సీఎం రేవంత్ సర్కార్ మూర్ఖపు నిర్ణయాలు: కేటీఆర్

sharma somaraju

YCP MLA Pinnelli: మరో సారి హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి .. కీలక వినతి

sharma somaraju

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం .. లోయలో బస్సు పడి 21 మంది మృతి..40 మందికి గాయాలు

sharma somaraju

`జ‌గ‌న్ అనే నేను`కు ఐదేళ్లు పూర్తి… సెన్షేష‌న‌ల్ విక్ట‌రీ వెన‌క‌..?

ఆ టీడీపీ టాప్ లీడ‌ర్‌కు చివ‌రి సారి అయినా ప‌రువు ద‌క్కుతుందా… ఉన్న‌ది కూడా పోతుందా ?