Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. జనవరి 12వ తారీకు విడుదలైన ఈ సినిమా మిక్సడ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్ల పరంగా నెంబర్స్ మాత్రం ఊహించని రేంజ్ లో వస్తున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ పూర్తిగా మాస్ యాంగిల్ లో కనబడటం జరిగింది. తల్లి కొడుకు సెంటిమెంట్ నేపథ్యంలో స్టోరీ ఉన్నాగాని మహేష్ నీ చాలా మాసివ్ గా త్రివిక్రమ్ చూపించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ వేసిన స్టెప్పులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రెండు పాటలకు మహేష్ వేసిన స్టెప్పులు థియేటర్లు దద్దరిల్లాయి.
“గుంటూరు కారం” భారీ అంచనాల మధ్య విడుదలైన గాని సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రారంభంలో చాలా నెగటివ్ టాక్ వచ్చింది. కానీ ప్రస్తుతం ఫ్యామిలీస్ బాగా వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన అతడు, ఖలేజా సినిమాలకు కూడా ఇదే రకమైన టాక్ ప్రారంభంలో వచ్చింది. కానీ థియేటర్ నుండి ఆ రెండు సినిమాలు బయటికి వెళ్ళాక టెలివిజన్లో ఇప్పటికీ కూడా మంచి ఆదరణ దక్కించుకుంటాయి. రెండు సినిమాలలో త్రివిక్రమ్ మహేష్ బాబుని చాలా వైవిధ్యంగా చూపించారు. సో అదే రకంగా “గుంటూరు కారం”లో మ్యాజిక్ జరుగుతుందని భావించిన ఫ్యాన్స్ కి కొద్దిగా నిరాశే ఎదురయింది.
అయితే తాజాగా ఈ సినిమా వారం రోజులలో 219 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు స్పష్టం చేయడం జరిగింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ సినిమా యూనిట్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఒక ప్రాంతీయ సినిమాకి ఈ రకమైన కలెక్షన్స్ రావటం ఇండస్ట్రీలో ఇదే తొలిసారి అని.. ఇది ఆల్ టైం రికార్డ్ అని స్పష్టం చేయడం జరిగింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో దాదాపు 12 సంవత్సరాల తర్వాత మహేష్ ఈ సినిమా చేయడం జరిగింది. దీంతో “గుంటూరు కారం”కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ క్రమంలో సంక్రాంతి నేపథ్యంలో రికార్డు స్థాయి కలెక్షన్స్ వచ్చాయి. దీంతో రెండో వారం నుండి కలెక్షన్స్ ఎలా ఉంటాయి అన్నది ఆసక్తికరంగా మారాయి.
Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!