Venkatesh: మన టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన వెంకటేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన సినిమాలతో ఎంతోమంది ఫ్యామిలి ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ తన సత్తాని నిరూపించుకుంటున్నాడు. అంతేకాకుండా ఈయన కుమారుడు రానా దగ్గుపాటి కూడా ఏ రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఎన్నో మంచి మంచి కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న వెంకీ మొట్టమొదటిసారి ఓ తప్పట అడుగు వేశాడు.
తాజాగా సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సినిమాలలో ” సైంధవ్” మూవీ ఒకటి. వెంకీ సినిమా అనగానే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ రిలీజ్ అనంతరం వెంకీ ఫ్యాన్స్ ని ఫుల్ డిసప్పాయింట్ చేసింది ఈ మూవీ. అసలు ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ అవ్వాల్సిన సినిమానే కాదు. సాధారణమైన రోజుల్లో పెద్ద ప్రాముఖ్యత లేని సినిమా అయినా కొందరు చూస్తూ ఉంటారు.
కానీ సంక్రాంతి బరిలో మాత్రం ఆ సినిమాకి సూపర్ రెస్పాన్స్ వస్తేనే కొనసాగుతుంది. లేదంటే ఒక మూలన కూర్చోవాల్సిందే. వెంకటేష్ కెరీర్ 75వ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. ఇక వెంకటేష్ తన 75వ సినిమాగా ఈ సినిమాని ఎంచుకుని చాలా పెద్ద తప్పు చేశాడనే చెప్పొచ్చు. తనకున్న పలుకుబడి ప్రకారం కనీసం రూ. 10 కోట్లు షేర్ ని రాబట్టాలి.
కానీ ఈ సినిమాకి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ వసూళ్లు రాబట్టడం గమనార్హం. ఇక రానున్న రోజుల్లో కూడా 10 కోట్లు షేర్ ని దాటే అంశాలు చాలా తక్కువగా ఉన్నాయి అంటున్నారు ట్రెండ్ విశ్లేషకులు. ఇక ఈ మూవీని మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు. కానీ ఈ సినిమా మాత్రం వాళ్ళ బడ్జెట్ కి క్రాస్ అయ్యే కలెక్షన్స్ కూడా రాబట్టేలా కనిపించడం లేదు. ఏదైనా వెంకటేష్ ప్రాముఖ్యత లేని కథని ఎంచుకుని తన 75వ సినిమా భారీ డిజాస్టర్ గా తన ఖాతాలో వేసుకోవడం వెంకీ ఫ్యాన్స్ కి ఆవేదనని మిగిల్చింది. ఇక రానున్న రోజుల్లో ఈ భారీ డిజాస్టర్ నుంచి కోల్కొని వెంకీ మరో మూవీ చేస్తాడో లేదో చూడాలి మరి.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!