Charmi: సీనియర్ హీరోయిన్ చార్మి మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఆ తరం కుర్రాళ్ళనే కాకుండా ఈ తరం కుర్రాలని కూడా ఆకట్టుకుంటుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో డీలా పడిపోయింది.
ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రొడ్యూసర్ గా కొనసాగుతుంది. అలాగే టాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్స్ అని బ్యానర్ ఏర్పాటు చేసి.. ఈ నిర్మాణ సంస్థలో రోగ్, పైసా వసూల్, జ్యోతిలక్ష్మి, లైగర్, రొమాంటిక్, మెహబూబా, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలను నిర్మించారు. ఇస్మార్ట్ శంకర్ మినహా మిగిలిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ లు కూడా అయ్యాయి.
ఇక పోతే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేస్తూ భారీ కామెంట్స్ చేసింది. ఈ ముద్దుగుమ్మ కి పెట్ డాగ్స్ అంటే చాలా ఇష్టం. అయితే ఈమె వద్ద మూడు బ్రీడ్ పెట్ డాగ్స్ ఉండేవట. రెండేళ్లు క్రితం ఓ డాగ్ దూరమైందట. ఇక ఆ కుక్కను తలుచుకుంటూ ఛార్మి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ని షేర్ చేసింది.
” నువ్వు దూరమై రెండు సంవత్సరాలు అవుతుంది. నీ కౌగిలిని మిస్ అవుతున్నాను. నీ ప్రేమను కోల్పోయాను. నువ్వు ఎప్పుడు నాకు అత్యంత ఇష్టమైన మగ బిడ్డగా ఉంటావు. నా జీవితంలో కి త్వరగా తిరిగిరా. నువ్వు లేకుండా అమ్మ అసంపూర్ణం ” అంటూ డాగ్ ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది చార్మి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!