ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గం మరోసారి హాట్ టాపిక్ అయింది. ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోటీ చేసే అవకాశం లేదని.. ఇటీవల వరకు వార్తలు వచ్చాయి. ఆయన కన్నా బలమైన నేత మరొకరి కోసం.. పార్టీ చూస్తోందని, పెద్ద ఎత్తున చర్చ తెరమీదికి వచ్చింది. అయితే.. ఇప్పుడు ఈ చర్చకు తెరదించుతూ.. వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. గన్నవరం టికెట్ను మరోసారి వంశీకే కేటాయించింది.
దీంతో గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ టీడీపీల మధ్య పోరు క్లారిటీ వచ్చేసింది. ఇక, ఇప్పుడు ఎవరి బలం ఏంటి? అనేది చూస్తే.. వంశీ విషయంలో ఆయనకు పక్కాగా ఉన్న ఓటు బ్యాంకు పదిలంగా నే ఉందని తెలుస్తోంది. గన్నవరం పరిధిలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ వంశీ తనపట్టును నిలబెట్టు కుంటున్నారు. ఇటీవల ఆన్ లైన్ సంస్థ చేపట్టిన సర్వేలో ఇదే విషయం స్పష్టమైంది. మెజారిటీ ఓటు బ్యాంకు స్థిరంగా వంశీ వైపే ఉంటుందని తెలుస్తోంది.
ఇక, టీడీపీ తరఫున అవకాశం దక్కించుకున్న యార్లగడ్డ వెంకట్రావు విషయంలో సింపతీ పనిచేస్తోందని అంటున్నారు. ఆయన పార్టీ మార్పును.. వైసీపీ అవకాశం ఇవ్వలేదు.. అందుకే ఆయన పార్టీ మారారని కొందరు.. చెబుతున్నారు. ఇదేసమయంలో వైసీపీ వాడుకుని వదిలేసిందని మరికొందరు అంటున్నారు. మొత్తంగా అయితే.. యార్లగడ్డ విషయంలో కొంత సింపతీ వర్కవుట్ అవుతోంది. ఇక, ఇక్కడ ఓట్ల చీలిక ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.
గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన యార్లగడ్డ.. ఓడిపోయారు. ఇప్పుడు ఆయనకు సానుకూలంగా ఉన్న వైసీపీ ఓటు బ్యాంకు.. సానుభూతి పరులు ఇప్పుడు టీడీపీవైపు మళ్లాలి. అలా జరిగితే.. భారీ మెజారి టీతో యార్లగడ్డ విజయం దక్కించుకుంటారు. అలా కాకుండా.. యార్లగడ్డ పార్టీ మారారనే కారణంగా.. వైసీ పీ అనుకూల ఓటు బ్యాంకు వంశీ వైపు మళ్లితే మాత్రం.. కొంత తేడా వచ్చే అవకాశం ఉంది. ఎలా చూసు కున్నా.. యార్లగడ్డకు సానుకూల ఓటు పెరగాలి.
అదే సమయంలో టీడీపీలో వంశీకి అనుకూలంగా వారు ఇటు వైపుకు రావాలి. ఈ రెండు జరిగితే.. యార్లగడ్డ గెలుపు ఖాయమని అంటున్నారు. ఇక, ఓవరాల్గా చూస్తే.. నియోజకవర్గంలో ఫైట్ మాత్రం టఫ్గానే ఉంటుందని సర్వేలు తేలుస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.