‘నానిగాడు’ సినిమా హీరో దుర్గా ప్రసాద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన సినిమా యూట్యూబ్లో లీక్ అవ్వడంపై తీవ్రంగా కలత చెందిన దుర్గా ప్రసాద్.. ఫిలిం చాంబర్ ముందు మంగళవారం పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. దుర్గాప్రసాద్ ఆత్మహత్యాయత్నం స్థానికంగా కలకలం సృష్టించింది.
యూట్యూబ్లో సినిమా లీక్ చేయడంపై ‘నానిగాడు’ మూవీ టీమ్ మంగళవారం ఫిలిం చాంబర్ ముందు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. సినిమా కోసం రూ. 40 లక్షల ఖర్చు చేశామని.. అంత కష్టపడి సినిమా తీస్తే ఇదేం న్యాయమని మండిపడ్డారు. సినిమాకు సెన్సార్ బోర్డు కూడా ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చిందని.. త్వరలో విడుదలకు రెడీగా ఉందని వాపోయారు. వెంటనే లింకులు తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించిన.. తర్వాతి రోజే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.