ఎన్నికల వేళ అన్ని రాజకీయ పక్షాలు.. ప్రజలను మచ్చిక చేసుకునేందుకు మేనిఫెస్టో(మేం అధికారంలోకి వస్తే.. మీకు ఇది చేస్తాం అని చెప్పే హామీల పత్రం) రిలీజ్ చేస్తాయి. ఇది రాజకీయాలు పుట్టిన నాటి నుం చి ఉంది. అనేక పార్టీలు.. అనేక రూపాల్లో మేనిఫెస్టోలను విడుదల చేస్తూనే ఉన్నాయి. అయితే.. ఏపీలో మేనిఫెస్టో అంటే.. వైసీపీ, వైసీపీ అంటే మేనిఫెస్టో… నిబద్దత, నిజాయితీ వంటివాటికి కూడా.. తమ మేని ఫెస్టో నిలువుటద్దం! అని చెప్పుకొనే పరిస్థితిలో వైసీపీ నాయకులు ఉన్నారు.
ఇదే 2019లో వైసీపీని ముందుకు నడిపించింది. అంతేకాదు..దీనినే ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ భగవ ద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పుకొచ్చారు. అయితే.. ఇప్పుడు కూడా ఇదే తరహాలో సీఎం జగన్.. మేనిఫె స్టోను రిలీజ్ చేశారు. గతంలో చెప్పిన నవరత్నాలకు కొనసాగింపుగా దీనిని తీసుకువచ్చినట్టు సీఎం చెప్పారు. మొత్తంగా రాష్ట్రంలో ఎంత వరకు చేయాల్నో.. అంతా చేస్తున్నామన్నారు. ఇంతకు మించి చేసే పరిస్తితి లేదని… కూడా వెల్లడించారు.
కట్ చేస్తే.. ఇప్పుడు మేనిఫెస్టోపై పెద్దగా జోష్ కనిపించడం లేదు. జనాల మాట దేవుడెరుగు.. నాయకులు కూడా.. దీనిని పట్టించుకోవడం లేదు. దీనిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు కూడా నాయకులు ముందుకు రావడంలేదు. నిజానికి 2019లో నవరత్నాల పేరుతో ఇచ్చిన తొలి మేనిఫెస్టో.. అదిరిపోయే రేంజ్లో జనాల నాలుకలపై నానింది. ఇంకేముంది.. జగన్ వస్తే.. తమ బతుకులు మారిపోతాయని అనుకున్నారు. ఇదే అన్ని చోట్లా కనిపించింది.. వినిపించింది.
కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే.. ఇంతకు మించి! అన్నట్టుగా టీడీపీ అధినేత చంద్రబాబు వండివారుస్తామని చెబుతున్నారు. జనాలకు కావాల్సింది.. ఇదే! తర్వాత అమలు చేయరని జగన్ చెబుతున్నా.. ఆయన చెప్పిన మేనిఫెస్టోలోనే చాలా కార్యక్రమాలు అమలు చేయని విషయం చర్చకు వస్తోంది. కాబట్టి.. ఎవరైనా ఎన్ని చెప్పినా.. తమకు అవకాశం ఉన్నంత వరకే చేస్తారు. కాబట్టి జగన్ చెప్పిన ఫార్ములా ఇప్పుడు బాబుకు వర్తించదు. పైగా ఆయన గట్టిగా చెబుతున్న రూ.4000 పింఛను గ్రామీణ స్తాయిలో దూసుకుపోతోంది. దీంతో వైసీపీ నాయకులు కూడా .. తమ మేనిఫెస్టో గురించి చర్చించలేని పరిస్థితి వచ్చింది.