Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఇంటి సభ్యులు గత కంటెస్టెంట్లకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రకరకాల ఎంటర్టైన్మెంట్ రంగాల నుండి గతంలో వచ్చిన వాళ్ళు ఎవరికి వారు తమ పెర్ఫార్మన్స్ చూపిస్తూ.. తెలివిగా గేమ్ ఆడుకునే వాళ్ళు. ఒకవేళ ఒకే రంగానికి చెందిన వారైనా గానీ ఇండివిడ్యువల్ గేమ్ మాత్రం ప్రదర్శించేవారు. కానీ ఇప్పుడు సీజన్ సెవెన్ లో సీరియల్ బ్యాచ్ హడావిడి ఎక్కువైపోయింది. సీరియల్ రంగానికి చెందిన వాళ్లు.. బిగ్ బాస్ హౌస్ లో… ఆడుతున్న గ్రూపుకి చూసే ప్రేక్షకులకు అసహ్యం కలిగిస్తుంది. హౌస్ లో సీరియల్ బ్యాచ్ మెజారిటీ కావడంతో చెలరేగిపోతున్నారు. వాళ్లంతా కలసికట్టుగా ఆడుతూ మిగతా సభ్యులను టార్గెట్ చేసి.. అనేక కుయుక్తులు పన్నుతున్నారు.
ముఖ్యంగా అమర్దీప్ చౌదరి.. హడావిడి మొదటి నుండి చాలా ఎక్కువ అయిపోయింది. రెండవ వారంలో పల్లవి ప్రశాంత్ నీ నామినేట్ చేస్తే సమయంలో రెచ్చిపోయి తర్వాత తన ఆట తీరుతో గ్రూప్ గేమ్ తో తన గాలి తానే తీసుకుంటున్నాడు. ఇదే సమయంలో ఇప్పుడు ఐదో వారంలో పవరాస్త్ర టాస్క్ లో కూడా వ్యవహరించడం జరిగింది. హౌస్ మేట్స్ అయ్యేందుకు ఇంటి సభ్యుల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇదే సమయంలో సీజన్ సెవెన్ మొదటివారం కెప్టెన్సీ టాస్క్ కూడా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం బుధవారం సంచాలకులుగా యావర్, శోభా శెట్టిలను బిగ్ బాస్ నియమించడం జరిగింది. ఇదే సమయంలో టాస్క్ కూడా ఆడాలని…సంచాలకుడిగా వ్యవహరించాలని బిగ్ బాస్ ఆదేశించాడు.
ఈ క్రమంలో యావర్ కాస్త కన్ఫ్యూజ్ అయ్యాడు. సంచాలకుడిగా గమనిస్తూనే మరో పక్క గేమ్ ఆడుతూ.. ఎవరు ఎలా వ్యవహరించారు అర్థం కాక కొన్నిసార్లు తాను తీసుకున్న నిర్ణయాలను కూడా మార్చుకున్నారు. దీంతో హౌస్ లో గందరగోళం నెలకొంది. పరిస్థితి ఇలా ఉంటే అమర్దీప్..యావర్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించి.. సుబ్బు దానికి సపోర్ట్ చేస్తున్నాడు అంటూ నోరు జారుతాడు. రూల్స్ పరంగా శివాజీ మరియు ప్రశాంత్ గేమ్ ఆడిన గాని ఇతరులను యావర్ ఎంపిక చేయటం హౌస్ లో గొడవకు దారి తీసింది. దీంతో ఎంతో అన్యోన్యంగా ఉండే శివాజీ..యావర్ మధ్య మొదటి కెప్టెన్సీ టాస్క్ పెద్ద చిచ్చు పెట్టినట్లయింది.