Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ రసవతరంగ సాగుతోంది. విజయవంతంగా 9 వారాలు గడిచి పదోవారం గేమ్ సాగుతోంది. సీజన్ సెవెన్ దాదాపు చివరి దశకు వచ్చేసినట్టే. ఈ క్రమంలో హౌస్ లో ప్రారంభంలో 14 మంది సభ్యులు తర్వాత వైల్డ్ కార్డు రూపంలో ఐదుగురు సభ్యులు ఎంట్రీ ఇవ్వగా… 9 వారాలకు 9 మంది ఎలిమినేట్ కావడంతో.. హౌస్ లో ప్రస్తుతం పదికి పైగా సభ్యులు ఉన్నారు. వీరిలో ఎవరు టాప్ 5 లోకి వెళ్తారు అన్నది చాలా ఉత్కంఠ భరితంగా మారింది. ఇదిలా ఉంటే పదో వారంలో నామినేషన్స్ కంప్లీట్ అయ్యాక మంగళవారం నుండి ఫ్యామిలీ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఫ్యామిలీ వీక్ నేపథ్యంలో హౌస్ లో సందడి వాతావరణం నెలకొంది. చాలా వారాల తర్వాత కుటుంబ సభ్యులను చూస్తున్న హౌస్ మేట్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
మంగళవారం ఎపిసోడ్ లో ముగ్గురు కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి రావడం జరిగింది. ముందుగా శివాజీ పెద్దకొడుకు రావటం జరిగింది. ఆ తర్వాత అర్జున్ అంబటి భార్య సురేఖ వచ్చింది. అనంతరం అశ్విని తల్లి రమా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత తల్లిని చూసిన అశ్విని బోరున ఏడ్చేసింది. మనసులో ఉన్న భారం మొత్తం తల్లికి చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ క్రమంలో అశ్విని తల్లి రమా ఆమెను ఓదారుస్తూ.. గేమ్ పరంగా ధైర్యం చెబుతూ కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. మీ వాళ్ళు అనుకుంటున్నా నీవు.. పొరపాటు పడుతున్న పెద్దవాళ్లతోనే ఉండు అంటూ పరోక్షంగా అశ్విని నీ అలర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అర్జున్ భార్య ప్రెగ్నెంట్ కావడంతో ఆమెకు హౌస్ లో సీమంతం చేశారు.
దీంతో అర్జున్ కన్నీటి పర్యంతమయ్యాడు. శివాజీ తన పెద్ద కొడుకుని చూసి కూడా ఏడవటం జరిగింది. మంగళవారం బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం జరిగింది. బుధవారం మరికొంతమంది కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు హౌస్ లోకి రాబోతున్నారు.