Brahmamudi 185 ఎపిసోడ్: ఇందిరా దేవి తనతో మాట్లాడడం లేదనే కోపం తో అపర్ణ కూడా కావ్య తో ఎవరూ మాట్లాడేందుకు వీలు లేదని ఇంట్లో అందరికీ కఠినమైన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అలా చెయ్యడానికి ఇష్టం లేకపోయినా కూడా అపర్ణ మాటకు అడ్డు చెప్పడం ఇష్టం లేక, అందరూ కావ్యతో మాట్లాడుకునే ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. ఈ క్రమం లోనే కావ్య కాఫీ తీసుకొని హాల్ లోకి వస్తుంది.
కావ్య తో మాట్లాడడం మానేసిన కుటుంబ సభ్యులు: ముందుగా ఇందిరా దేవి కి ఇవ్వాలని చూస్తుంది, మొదట తీసుకోవాలని అనుకున్నా, ఆ తర్వాత అపర్ణ ని చూసి వెళ్ళిపోతుంది. అలా ఇంట్లో ఎవ్వరూ కూడా కావ్య ఇచ్చే కాఫీని తీసుకోరు. చివరికి కావ్యకు ఎప్పుడూ అండగా ఉండే ధాన్య లక్ష్మి కూడా అలాగే ప్రవర్తిస్తుంది. ఇంట్లో అందరూ తనతో మాట్లాడకుండా ఉండేందుకు నిర్ణయించుకున్నారనే విషయాన్నీ కావ్య అర్థం చేసుకొని బాధపడుతుంది. అలా ఆలోచిస్తూ వంటింటికి వెళ్లి బాధపడుతుండగా అక్కడికి ధాన్య లక్ష్మి వస్తుంది.
కళ్యాణ్ బైక్ ని 8 వేలకు వేలం వేసి అమ్మేయబోయిన అప్పు :
అసలు ఏమి జరిగిందో చెప్పండి చిన్న అత్తయ్య, మీరంతా ఇలా మాట్లాడకుండా ఉంటే నేనేదో చెయ్యకూడని తప్పు చేసిన భావన కలుగుతుంది, చాలా బాధ వేస్తుంది అని అంటుంది కావ్య. ఎంత అడిగినా ధన్య లక్ష్మి మాట్లాడకుండా తన పని తానూ చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత వెళ్లే ముందు చివర్లో ఒక కాగితం మీద ‘ఏమి అనుకోకు కావ్య, కావాలని చెయ్యడం లేదు, నీతో మాట్లాడొద్దు అని మా వదిన అపర్ణ అందరికీ కఠినమైన ఆంక్షలు విధించింది, అందుకే మాట్లాడడం లేదు’ అని రాస్తుంది. మరోపక్క అనామిక ని కలవడానికి వెళ్తున్న దారిలో బైక్ ఆగిపోవడం తో కళ్యాణ్ బైక్ ని అప్పు ని రోడ్డు మీదనే వదిలేసి కారు ని లిఫ్ట్ అడిగి వెళ్తాడు, దీనికి అప్పు రివెంజ్ తీర్చుకుంటూ, ఆ బైక్ ని వేలం వేసి అమ్మేయాలని చూస్తుంది. కేవలం 8 వేల రూపాయలకే అమ్మేయాలని చూస్తున్న సమయం లో అప్పుడే ఆటో దిగి ఏమి చేస్తుంది ఈ పిల్ల అని అనుకుంటూ ఉంటాడు.
ఇంట్లో వాళ్ళని మోసం చేసేందుకు స్వప్న మరో ప్లాన్:
దగ్గరకి వెళ్లి చూస్తే బైక్ ని 8 వేల రూపాయలకు వేలం వేసి అమ్మేయబోతుండడం చూసి షాక్ అవుతాడు. ఏంటి బ్రో మూడు లక్షల రూపాయిల బైక్ ని 8 వేల రూపాయలకు అమ్మేయాలని చూస్తావా అని అంటాడు. ఇది నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళినప్పుడు ఆలోచించాలి అని అంటుంది అప్పు. అప్పుడు కళ్యాణ్ సారీ బ్రో, అనామిక ని కలవాలని ఆతృతలో వెళ్ళాను, ఏమి అనుకోకు అంటాడు. సరే వెళ్లిన పని ఏమైంది అని అప్పు అడగగా, దానికి కళ్యాణ్ నిరాశతో మాట్లాడుతూ ఆ అనామిక అనే అమ్మాయికి పెళ్లి అయిపోయిందట అని చెప్తాడు. అప్పుడు అప్పు గట్టిగా నవ్వుతూ నీకు ఇలాగే కావలి రా , నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నా అని అంటుంది. అలా కాసేపు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగిన తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతారు.
మరోపక్క కావ్య వేసిన డిజైన్స్ లో కొన్ని మార్పులు క్లైంట్స్ చెప్పగా రాజ్ కావ్య ని సహాయం అడగడం ఇష్టం లేక ఆ డిజైన్స్ ని ఆయనే సరిచేసే ప్రయత్నం చేస్తాడు. కావ్య అది గమనించి ఏమి చేస్తున్నారు అని అడుగుతుంది.ఎంత అడిగిన రాజ్ సమాధానం చెప్పడు, ఆ తర్వాత శృతి కి ఫోన్ చేసి అడగగా ఆమె అసలు విషయం చెప్తుంది. అప్పుడు కావ్య ఆ బ్లూ ప్రింట్ నాకు పంపు వేసి పంపిస్తాను అని అంటుంది. మరోపక్క స్వప్న కి మూడు నెలలు నిండిపోతుంది. మూడు నెలలు నిండితే కడుపు తెలుస్తుంది కదా, ఏమి చెయ్యాలో తెలియక ఇంట్లో వాళ్లకు కడుపు వచ్చినట్టు నమ్మించడానికి నలుగురు తినే బిర్యానీని తానే తినే ప్రయత్న చేస్తుంది.
Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!