Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ షోలో ఇప్పటివరకు ఆరు సీజన్లు కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం ఏడవ సీజన్ రన్ అవుతుంది. మొత్తం 14 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా నలుగురు ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం హౌస్ లో 10 మంది ఉన్నారు. అయితే బిగ్ బాస్ షోలో ఏదో ఒక జంట హైలెట్ అవుతూ ఉంటది. లేదా ఫ్రెండ్స్ ఇంకా పలు బాండింగ్ కారణంగా కొన్ని సీజన్స్ కి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. అయితే ఇప్పుడు ఇదే రీతిలో సీజన్ సెవెన్ కి కూడా ఒక బాండింగ్ విషయంలో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆ బాండింగ్ మరేదో కాదు నటుడు శివాజీ ఇంకా పల్లవి ప్రశాంత్ వారిద్దరు ఆడుతున్న ఆట తీరుకు షోకి చాలామంది కనెక్ట్ కావడం జరిగింది.
కొన్ని విషయాలలో బిగ్ బాస్ హౌస్ లో మిగతా కంటెస్టెంట్లతో పోల్చుకుంటే పల్లవి ప్రశాంత్ కాస్త వెనకబడి ఉన్నాడు. పైగా మనోడు యూట్యూబర్. కానీ హౌస్ లో టెలివిజన్ రంగం నుండి ఆరితేరిన చాలా మంది రావటం జరిగింది. ముఖ్యంగా మా సీరియల్ బ్యాచ్ సభ్యులు తోపులుగా ప్రారంభంలో గేమ్ ఆడారు. అదే సమయంలో ప్రశాంత్ ఆట తీరని విమర్శించి టార్గెట్ గా చేసుకుని అనేక మాటలు కూడా మాట్లాడటం జరిగింది. ఈ క్రమంలో శివాజీ పెద్దన్న పాత్ర పోషించి సామాన్యుడిగా హౌస్ లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ కి ఒక కవచం లాగా నిలిచాడు. అతనిపై మాట పడకుండానే అతని ని మోటివేట్ చేస్తూ.. శివాజీ చాలామంది హృదయాలను గెలుచుకున్నాడు.
నటుడిగా అతనికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ తనకి ముక్కు ముఖం తెలియకపోయినా గాని ప్రశాంత్ నీ కాపాడుతూ మరోపక్క అతనిని గేమ్ పరంగా అన్ని రకాలుగా పైకి తీసుకొస్తూ శివాజీ చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నాడు. ఇదే సమయంలో ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకుంటున్నాడు. మరోపక్క ప్రశాంత్ కూడా శివాజీని తన గురువుగా భావిస్తూ.. ఆయన ఇచ్చే ప్రతి ఆలోచన స్వీకరిస్తూ అద్భుతమైన గేమ్ ప్రదర్శిస్తున్నారు. నిజంగా హౌస్ లో శివాజీ లేకపోతే ప్రశాంత్ నీ సీరియల్ బ్యాచ్ ఓ ఆటాడుకునేదని బయట చాలామంది బిగ్ బాస్ మాజీ ఆటగాళ్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే సీజన్ సెవెన్ మాత్రం శివాజీ.. ప్రశాంత్ ఆటతీరు వారి బాండింగ్ వల్ల షోకి చాలామంది ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు.