Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ చాలా రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లో కొనసాగాలంటే పవర్ ఆస్త్ర గెలవాలని కంటెస్టెంట్లకు బిగ్ బాస్ పెడుతున్న టాస్కులు షో చూస్తున్న వారికి మరింత ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. మొదటి పవర్ అస్త్ర ఆట సందీప్ గెలవగా రెండో పవర్ అస్త్ర శివాజీ గెలవడం జరిగింది. ఈ ఇద్దరికీ ఇమ్యూనిటీ లభించింది. ఈ క్రమంలో మూడో వారం మూడో పవర్ అస్త్రానికి సంబంధించి పోటీ ప్రిన్స్, శోభా శెట్టి, ప్రియాంక మధ్య మొదలవగా..ప్రిన్స్ అనర్హుడని ప్రియాంక అదే విధంగా శోభ శెట్టి నిర్ణయించడంతో అతడు గోల్డెన్ ఛాన్స్ కోల్పోయాడు. అసలు ఇక్కడ పోటీదారులకు ఎటువంటి టాస్క్ పెట్టకుండానే ప్రత్యర్థిని తొలగించే హక్కు వాళ్ళకే ఇవ్వటం అన్ ఫెయిర్ అనిపించింది.
కావాలని మూడో పవర్ అస్త్ర ఆడవాళ్లు గెలిచే రీతిలో బిగ్ బాస్ వ్యవహరించాడని శుక్రవారం ఎపిసోడ్ పై జనాలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఫైనల్ గా మూడో పవర్ అస్త్ర గెలవడానికి ప్రియాంక మరియు శోభాశెట్టికి యంత్రపు ఎద్దు మీద టాస్క్ పెట్టడం జరిగింది. ఈ ఎద్దు మీద ఎవరు ఎక్కువ సమయం ఉంటారు కింద పడకుండా కూర్చుంటారా వారే విన్నర్ అని బిగ్ బాస్ తెలియజేస్తాడు. దీంతో ప్రియాంక ఇంకా శోభ ఎక్కువ సమయం ఎద్దు మీద ఉండే ప్రయత్నాలు చేయడం జరుగుద్ది.
అయితే ఎద్దు కుదుపులకు శోభ శెట్టి కింద పడిపోయింది. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చేతికి బలమైన గాయం కావడంతో ఇంట్లో ఉన్న మిగతా సభ్యులంతా వచ్చి శోభా చేతికి చికిత్స చేయడం జరిగింది. నొప్పి బాధ తట్టుకోలేక మామూలుగానే ఏడ్చే శోభ ఈ దెబ్బతో గుక్క పెట్టి ఏడిచింది. చివరకి ప్రియాంక పవర్ అస్త్ర గెలవడం జరిగింది. అయితే శోభా శెట్టికి తీవ్రమైన గాయం కావడంతో ఆమె హౌస్లో కొనసాగుతుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.
Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!