Madhuranagarilo February 12 2024 Episode 285: శ్యామ్ రాదని తీసుకొని వెళ్తాడు. కృష్ణ కాత్యానికి ఫోన్ చేసి చాలా థాంక్స్ మేడం నేను చెప్పమన్నట్టు చెప్పినందుకు అని అంటుంది. దాందేముంది మేడం మీరు సమయానికి ఫోన్ చేశారు కాబట్టి చెప్పాను అలా చెప్పడం తప్పే అయినా సరే ఒక జంటని కలపడానికి చేసాం కదా అని కాత్యాయని అంటుంది. మా ఫ్రెండ్ వాళ్ళు విడిపోకూడదని మీ చేత అలా అబద్దం చెప్పించాను మేడం అని కృష్ణ థాంక్స్ చెప్తుంది. కట్ చేస్తే,హాస్పిటల్ కి వెళ్లాలంటే నాకు చెప్పొచ్చు కదా రాదా? మీ అక్కని తీసుకుని ఎందుకు వచ్చావు ఇంకోసారి ఎప్పుడూ మీ అక్కని తీసుకొని రాకు అయినా కృష్ణ వాళ్ళ హాస్పిటల్ కి వెళ్తానని వేరే హాస్పిటల్ కి ఎందుకు వెళ్లారు వెళ్ళిందే మంచిదయిందిలే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని తేలిపోయింది కదా అని శ్యామ్ అంటాడు. ఇకమీదట ఎవరు ఏమిచ్చినా తినకు రాదా ముఖ్యంగా మీ అక్క ఇస్తే ఏదీ తినకు తనకు తెలియదు కదా నిన్ను కడుపులో ఉన్న బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత అని శ్యామ్ అంటాడు.
ఏంటి రాధా ఏమి మాట్లాడవు అని శ్యామ్ అంటాడు. కొన్నిసార్లు మాట్లాడకపోవడమే మంచిది సార్ అని రాదా అంటుంది. నన్ను మాట్లాడొద్దంటున్నావా రాధా అని శ్యామ్ అంటాడు. నేను మాట్లాడకపోవడం మంచిదంటున్నాను సార్ అని రాధా అంటుంది. మనం వెళ్లాల్సింది రైట్ సైడ్ కదా సార్ లెఫ్ట్ తీసుకువెళ్తున్నారు ఏంటి అని రాదా అడుగుతుంది. సప్రైజ్ రాదా అని శ్యామ్ అంటాడు. ఇచ్చిన సప్రైజ్ చాల్లే అని రాదా అంటుంది. భయపడకు రాదా ఏమీ కాదులే అని శ్యామ్ అంటాడు. నాకు తెలియకుండానే అమ్మని చేశారు కదా అందుకే అని రాదా అంటుంది. ఇప్పుడు అలాంటిది కాదులే రాదా అని శ్యామ్ అంటాడు. కట్ చేస్తే, రుక్మిణి ఇంటికి వస్తుంది. ఏంటి రుక్మిణి ఒక్కదానివే వచ్చావు రాదెక్కడ అని మధుర అడుగుతుంది. శ్యామ్ వచ్చాడు అత్తయ్య వాళ్ళకి ఏదో పని ఉందంట చూసుకొని వస్తాను అన్నారు అని రుక్మిణి అంటుంది. ఇంతలో పండు వచ్చి అమ్మా నాకు ఆకలి వేస్తుంది అమ్మ ఎప్పుడు వస్తుంది అని పండు అడుగుతాడు.
ఎప్పుడొస్తారో తెలియదు నాన్న అప్పుడు దాకా నువ్వు ఆకలితో ఉంటావా మీ పెద్దమ్మ ఉంది కదా తను తినిపిస్తుంది తిను అని మధుర అంటుంది. అమ్మ వచ్చిన తర్వాతే తింటాను అని పండు మారం చేస్తాడు. మీ పెద్దమ్మ కూడా మీ అమ్మ లాంటిదే నాన్న తిను మీ పెద్దమ్మ తినిపిస్తుంది అని మధుర అంటుంది. పండు నువ్వేం తింటావ్ చెప్పు అని రుక్మిణి అడుగుతుంది. పెసరట్టు ఉప్మా కావాలి అని పండు అంటాడు. రుక్మిణి నీ కొడుకుని నీ వైపు తిప్పుకోవాలి అంటే వాడిని మంచిగా చేసుకో దోశ వేసి నువ్వే తినిపించు అని మధుర అంటుంది. అంటే ఏంటి అత్తయ్య మీ ఉద్దేశం అని రుక్మిణి అంటుంది. పండు ని నీ వైపు తిప్పుకుంటే నీ కొడుకు అయినా నీకు దక్కుతాడు కదా అని మధుర అంటుంది. మీ కొడుకు నాకు దక్కడా అని చెప్తున్నారా అత్తయ్య అని రుక్మిణి అంటుంది.
అలా అనలేదమ్మా శ్యామ్ దగ్గర కావాలంటే పండు నీకు దగ్గరవుతే తర్వాత నీకు వాడు దగ్గరవుతాడు అని మధుర చెబుతుంది.సరే అత్తయ్య అని రుక్మిణి దోసెలు వేయడానికి వెళుతుంది. కట్ చేస్తే, ఏంటి సార్ ఇక్కడికి తీసుకువచ్చారు అని రాదా అడుగుతుంది. నువ్వు ముందు రా రాధా అని శ్యామ్ లోపలికి తీసుకువెళ్తాడు. అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని రాదా అడుగుతుంది. కట్ చేస్తే, రుక్మిణి పెసరట్టు వేస్తూ ఉండగా తన చేయి కాలుతుంది చెయ్యి కాలడంతో అరుస్తుంది రుక్మిణి. ఏమైంది రుక్మిణి అంటూ మధుర పరిగెత్తుకొస్తుంది. దోషకు బొక్కలు ఉన్నాయాని అడ్జస్ట్ చేస్తుంటే చేయి కాలింది అత్తయ్య అని రుక్మిణి అంటుంది. నేను ఆ బొక్కలోకి పిండి పోస్తాను కాని నువ్వు వెళ్ళు అని మధుర పెసరట్టు వేస్తుంది. శ్యాంసుందర్ రాదని ఎక్కడికి తీసుకు వెళ్ళాడు అనే టెన్షన్ పడుతుంది రుక్మిణి. కట్ చేస్తే, ఇక్కడికి బెస్ట్ కపుల్స్ అవార్డు జరుగు ఉందంట రాదా ఈ హోటల్ కి అని శ్యామ్ అంటాడు. మరి మనం ఎందుకు వచ్చాం అని రాదా అడుగుతుంది.
ఈ హోటల్ వాళ్ళు షాపింగ్ మాలలో చిట్టీలు పెడతారు అంట రాదా మనం షాపింగ్ చేసినప్పుడు చిట్టి ఫోన్ నెంబర్ ఇస్తారు కదా దాన్ని బట్టి బెస్ట్ కపుల్ చిట్టి తీస్తారంట అందులో మన పేరు కూడా ఉంది మనతో పాటు ఐదు కపుల్స్ కూడా వచ్చారు రాధా అని శ్యామ్ చెబుతాడు. అక్కడ ఉన్నావ్ ఒక ని అడిగి రూమ్ తాళం తీసుకొని శ్యామ్ గదిలోకి వెళ్తాడు. ఎంత బాగుంది రాధా ఈ రూము వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి రా అర్ధగంటలో బెస్ట్ కపుల్ అవార్డు తీస్తారంట అని శ్యామ్ అంటాడు.
నేను కాను లే సార్ మీరు అవ్వండి అని రాదా అంటుంది. శ్యామ్ స్నానం చేసి వస్తాడు. రాధా తొందరగా కానీ అర్థగంటే టైం ఉంది బెస్ట్ కపుల్ అవార్డు తీస్తారు ఏం చూస్తున్నావ్ అని శ్యామ్ అంటాడు.సార్ ప్రవర్తనలో తేడా వచ్చింది అసలు ఎందుకు ఇక్కడికి తీసుకు వచ్చాడు సారీ ప్లాన్ చేశారా ఈ హోటల్ వాళ్ళు నిజంగానే కపుల్స్ ని రమ్మని ఫోన్ చేశారా అసలు ఏం జరుగుతుంది అని రాధా ఆలోచిస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!