Malli Nindu Jabili February 7 2024 Episode 566: మీరు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు మీరు ఎందుకు కష్టపడడం మీరు ఇంట్లో ఉండండి నేను జాబ్ చేస్తాను అని మల్లి అంటుంది.లేదు మల్లి నువ్వు పడ్డ కష్టానికన్నా నా కష్టం ఏమి ఎక్కువ కాదు నువ్వు ఇంట్లోనే ఉండు నేనే జాబ్ చేసి నిన్ను బాగా చూసుకుంటాను అని గౌతమ్ అంటాడు.కట్ చేస్తే,గుడికి వెళ్దాం అన్నావ్ ఏంటి విశేషం అని గౌతమ్ అంటాడు.మాలిని అక్క కోసం అని మల్లి అంటుంది. మాలిని పేరు మీద తనకు పుట్టబోయే బిడ్డ పేరు మీద అర్చన చేస్తుంది. పంతులుగారు మా అక్క భర్తను చంపిన వాడు కూడా దొరకాలని పూజ చేయండి అని మల్లి అంటుంది. నీ కోరికలో ఏమైనా అర్థం ఉందా మల్లి దేవుడు నేరస్థుని పట్టిస్తాడంటే ఊరుకో పోలీస్ స్టేషన్ ఉండాల్సిన అవసరం లేదు అని గౌతమ్ అంటాడు.
ఈ పోలీసులు కోర్టుల మీద నాకు నమ్మకం లేదు దేవుడే న్యాయం చేస్తాడు పోలీసుల కంటే ఆ నేరస్తుడు ముందు నాకే దొరికేలా ఆ దేవుడు చేస్తాడు చూడండి అని మల్లి అంటుంది. మా ఆయన జాబ్ చేస్తున్నాడు ఆయన పనిలో మంచిని కల్పించి ఆయన ఉన్నత స్థితికి ఎదిగేలా చేయి అలాగే మాలిని అక్క కూడా బాగుండేలా చేయి వసుంధరమ్మ గారికి మా ఆయన మీద ఉన్న అనుమానం తొలగిపోయేలా చేయి అని మల్లి మనసులో కోరుకుంటుంది. పూజారి గారు నిమ్మకాయ ఇచ్చి మీ అక్కకు దిష్టి తీసి తొక్కించి దూరంగా పడేయి మీ అక్క మీద ఉన్న దిష్టి పోతుంది ఈ ప్రసాదం మీ అక్కకు తినిపించు అంతా శుభమే జరుగుతుంది అని పంతులుగారు చెప్తారు. అలాగే పంతులుగారు అని మల్లి వెళ్ళిపోతారు. ఏవండీ నేను మాలిని అక్కకు ఇవన్నీ ఇచ్చేసి వస్తాను మీరు వెళ్ళండి అని మల్లి అంటుంది. నువ్వు అక్కడికి వెళ్లి వసుంధర తను రెచ్చగొట్టడం అవసరమంటావా అని గౌతమ్ అంటాడు. అమ్మగారు ఏదో అంటారని నేను అక్కను చూసుకోకుండా ఉండలేనండి అందరితోపాటు నేను తనకు తోడుగా ఉన్నానని అక్కకు భరోసా ఇవ్వాలి అని మల్లి అంటుంది. సరే నువ్వు వెళ్లి జాగ్రత్తగా రా వసుంధర అత్త నిన్ను ఏమైనా అన్నది అని తెలిస్తే మాత్రం ఊరుకోను అని గౌతమ్ అంటాడు.
నేను ఆఫీస్ కి వెళ్తాను అని గౌతమ్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, మీరా జ్యూస్ తెచ్చి మాలినికి తాగమని ఇస్తుంది. నా కూతురికి నువ్వు ఏ సేవలు చేయనవసరం లేదు అని వసుంధర అంటుంది. ఏమైందమ్మా గారు అని మీరా అడుగుతుంది. వద్దని చెప్తున్నాను గా వద్దు అంతే వీళ్లను నమ్మలేము మాలిని వీళ్ళు అడవిలో నుంచి వచ్చిన మనుషులు అని వసుంధర అంటుంది. ఇన్నాళ్లు అడవి మనుషులు చేసినవంటే తిన్నవు వసుంధర అని శరత్ అంటాడు. ఏమి అవసరం లేదు శంకరమ్మ నువ్వు వెళ్లి మాలినీకి జ్యూస్ కలిపి తీసుకురా నేను తాగిస్తాను అని వసుంధర అంటుంది. అలాగేనమ్మా అని శంకరమ్మ వెళ్తుంది. ఇంతలో మల్లి అక్కడికి వస్తుంది. ఎందుకు వచ్చావు అని వసుంధర అంటుంది. ఇక్కడ నా అక్క నా తల్లి తండ్రి ఉన్నారు అని మల్లి అంటుంది. ఇక చేసింది చాలు నువ్వు బయటికి వెళ్ళు అని వసుంధర అంటుంది. పూజ చేయించి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మొక్కుకున్నాను పంతులుగారు ప్రసాదం పెట్టారు అమ్మ ఈ నిమ్మకాయ అక్క కాలి కింద పెట్టి దిష్టి తీసి బయటపడేయి అని మల్లి చెబుతుంది.
అక్క ఈ ప్రసాదం తిను తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు అని మల్లి ప్రసాదం ఇస్తుంది. నువ్వు నీ తల్లి కలిసి నా కూతుర్ని ఏం చేద్దాం అనుకుంటున్నావే అని వసుంధర ప్రసాదాన్ని కింద పడేస్తుంది. అమ్మ ప్రతి దాన్ని నెగటివ్ గా ఆలోచించకు ప్రసాదం తింటే ఏమవుతుంది అని మాలిని అంటుంది.ఏం మల్లి అ కుంకుమ పువ్వులో ఏం కలిపావే ఆ నిమ్మకాయ ఏం పూజ చేసి తీసుకొచ్చావు అని వసుంధర అంటుంది. మతుండే మాట్లాడుతున్నావా అమ్మగారు అని మల్లి అంటుంది. మనం ఇక్కడ ఉంటేనే అమ్మగారికి కోపం వస్తుంది అని మీరా అంటుంది. మీరు పక్కన ఉంటేనే గాలి సోకి విషమైపోతుంది ఇంకెప్పుడు మా ఇంటికి రాకు అని వసుంధర అంటుంది. పిచ్చి పట్టిందా నీకు అని మల్లి అంటుంది. అమ్మ ఏదో కోపం అలా అనింది మీరేమీ మనసులో పెట్టుకోకండి అని మాలిని అంటుంది. కచ్చితంగా చెప్తున్నాను అందులో విషం ఉంది అని వసుందర ఉంటుంది. నోటికొచ్చినట్టు మాట్లాడకండి అని మల్లి అంటుంది.
మీ అమ్మ సేవలు నీ పూజలు మాకేం అక్కర్లేదు బయటికి పో అని వసుంధర అంటుంది. ఏంటి అక్క అమ్మ ఇలా మాట్లాడుతుంది నేను తెచ్చిన ప్రసాదంలో విషం ఉందా నువ్వు నమ్ముతావా అని మల్లి అంటుంది. మల్లి నమ్మడం నమ్మకపోవడం పక్కన పెడితే నువ్వు ముందు బయటికి పో అని మాలిని అంటుంది. నేను వెళ్ళను ఏం చేస్తారు అని మల్లి అంటుంది. బయటికి పోవా అని వసుంధర మల్లి నీ పట్టుకుని నెట్టేస్తుంది అక్కడ ఉన్న సోపాకు తగిలి తలకి గాయం అవుతుంది. మీరు చేసింది ఏమి బాగోలేదమ్మా అని మీరా అంటుంది. ముందు నువ్వు బయటికి నడవే అని మీరా ని నెట్టేయ పోతూ ఉండగా కోపంతో మీరా వసుంధర మీద చేయి చేసుకుంటుంది.వసుంధర కోపంతో రగిలిపోతుంది. అమ్మగారు అనుకోకుండా చేయి జారింది అని మీరా అంటుంది.కట్ చేస్తే, మల్లి గాయంతో ఇంటికి రావడం చూసి వదిన నీ తలకి ఏమైంది అని నీలిమా అడుగుతుంది.
ఎక్కడో పడినట్టుంది అందుకే ఎప్పుడు పడితే అప్పుడు బయటకి వెళ్లొద్దని చెప్పేది అని కౌసల్య అంటుంది. నువ్వు ఇక్కడ కూర్చో వదిన అని మల్లి నీకు కూర్చోబెట్టి లోపలికి వెళ్లి మందు తెచ్చి గాయానికి రుద్దుతుంది నీలిమ. ఇప్పుడైనా చెప్పు వదిన ఏం జరిగింది అని నీలిమ అడుగుతుంది. మాలిని అక్కకి కుంకుమపువ్వు ఇద్దామని వెళ్లాను అని అక్కడ జరిగిందంతా చెబుతుంది మల్లి. వసుంధర బానే చేసిందిలే అని కౌసల్య అంటుంది. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావ్ జాలీ దయ లేకుండా అని నీలిమా అంటుంది. గౌతమ్ ఎన్నిసార్లు ఆ ఇంటికి వెళ్ళొద్దని చెప్తున్నా మేళ్ళకుండా ఊరుకుంటుందా ఇలాంటి దానికి అలా జరగడం మంచిదే అని కౌసల్య అంటుంది. ఇక్కడ నువ్వు అక్కడ వసుంధర అత్తయ్య వదిన ని ఇలా ఇబ్బంది పెట్టడ0 బాగుందా అని నీలిమ అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది