Malli Nindu Jabili January 30 2024 Episode 559: మాలిని అరవింద్ ని గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. నా చివరి శ్వాస ఉన్నంతవరకు నిన్ను నేను ఎప్పుడూ బాధపెట్టాను అని అరవింద్ అన్న మాటలన్నీ గుర్తుకు తెచ్చుకుని వెక్కివెక్కి ఏడుస్తుంది మాలిని. కట్ చేస్తే, శంకరమ్మ మల్లి వాళ్ళ ఇంటికి వస్తుంది. మీరేంటి ఇక్కడికి వచ్చారు అని గౌతమ్ అంటారు.మీరా గారు మీరే రమ్మన్నారు అని నాకు చెప్పి పంపించింది అని శంకరమ్మ అంటుంది. నేను రమ్మన లేదు కదా అని గౌతమ్ అంటాడు. నేనే అమ్మకి ఫోన్ చేసి శంకరమను రమ్మన్నానండి అని మల్లి అంటుంది. ఎందుకు మల్లి ఆవిడ నువ్వు రమ్మన్నావు అని గౌతమ్ అంటాడు. ఎవరవిడా అని కౌసల్య అడుగుతుంది. అరవింద్ బాబు నీ చంపుతుండగా చూసింది ఈవిడే అత్తయ్య అని మల్లి చెబుతుంది. నా కొడుకు మీద నింద వేసిన వసుంధర మనిషిని ఇంటికి ఎందుకు రప్పించావ్ అని కౌసల్య అంటుంది.
నీ కొడుకే చంపు ఉంటాడని నాకు ఏమాత్రం అనుమానం వచ్చినా వసుందరమ్మకు చెప్పే దాన్ని కదా అని శంకరమ్మ అంటుంది. అరవింద్ బాబుని ఎవరు చంపారు తెలుసుకోవాలి నా అక్క జీవితంతో ఇలా ఎందుకు ఆడుకుంటున్నారో తెలుసుకోవాలి ఎన్నో సంవత్సరాలు బిడ్డలు లేరని దేవుడికి మొక్కుకుంటే మా అక్కకు ఇప్పుడే దేవుడు బిడ్డను ప్రసాదించాడు ఆ బిడ్డను చూడకుండానే తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు అలాంటివాడు ఎవడైనా సరే శిక్ష పడేలా చేయాలి లేదంటే నా చేతులతో నేనే చంపాలి అని మల్లి అంటుంది. వాడి మొహం నేను చూడలేదు కదా అమ్మ అని శంకరమ్మ అంటుంది. ఇప్పుడు మీరు షాక్ లో ఉండుంటారు ఇంకా కొన్ని రోజులు టైం తీసుకుని అయినా సరే సరిగా గుర్తు తెచ్చుకొని చెప్పండి అని గౌతమ్ అంటాడు. ఆ శంకరమ్మ గౌతమ్ ని తదేకంగా చూస్తూ ఉంటుంది. గౌతమ్ వంక ఎందుకు ఆవిడ అలా చూస్తూ0ది అని కౌసల్య అనుకుంటుంది. ఎలాగైనా సరే మీరు ఆ వ్యక్తిని పట్టించాలమ్మ అని మల్లి ప్రార్థిస్తుంది.
సరే అమ్మ ఇక నేను వెళ్లి వస్తాను అని శంకరమ్మ వెళ్తూ గౌతమ్ ని మళ్లీ మళ్లీ చూస్తూ వెళుతుంది. కట్ చేస్తే, అరవింద్ కి ఖర్మకాండ జరిపిస్తూ మాలిని ఫోటో వంక చూస్తూ బాధపడుతుంది. నేను అరవింద్ ని ఈమధ్య అనుమానించడం మొదలుపెట్టిన తరువాత ఒక మాట అన్నాడు అమ్మ నన్ను ఇంతగా ఆ బాధ పెడుతున్నందుకు నువ్వు ఏదో ఒక రోజు చాలా బాధపడతావు అన్నాడు ఆ మాట ఎందుకన్నాడో అడుగు నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది అని మాలిని బాధపడుతుంది. నా భర్తను దక్కించుకోవడం కోసం నేను యుద్ధం చేసినట్టు పోరాడను ఆ పోరాటంలో గెలిచాను అనుకున్నాను కానీ ఇలా ఓడిపోతాను అనుకోలేదు నాకేమీ అర్థం కావట్లేదు మామ్ అని ఏడుస్తుంది మాలిని.కన్నతల్లి కళ్ళ ముందు కూతురు పసుపు కుంకుమ రాలి పోతే ఏ తల్లి తట్టుకోలేదు తన కళ్ళ ముందు కూతురు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంది అలాంటి కూతురు చిన్న వయసులోనే వైద్యవ్యాన్ని పొందడం చూసి తట్టుకోలేక గుండె పగిలిపోతుంది అని వసుంధర బాధపడుతుంది.
శంకరమ్మ నువ్వు చూసింది నా భర్తను కాదని చెప్పు 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత తిరిగి వస్తాడని ఎదురుచూస్తూ బ్రతికేస్తాను కానీ ఈ లోకంలో మాత్రం లేడని చెప్పకు అని మాలిని అంటుంది. నువ్వు అన్నట్టు వాళ్లు నీళ్లలో పడేసి ఉంటే ఏదో ఒక రోజు తిరిగి వస్తాడని చెప్పు ఉండేదాన్ని నేను ఆ నమ్మకాన్ని ఇవ్వలేను తల్లి అని శంకరమ్మ అంటుంది. పోయినోళ్ళు బిడ్డల రూపంలో పుడతారు అంట నీ కడుపున పుట్టేది అరవింద్ బాబు గారే నీ దుఃఖాన్ని దూరం చేసేది నీ బాధను పోగొట్టేది అన్ని ఆ బిడ్డే అవుతాడమ్మా అని మీరా అంటుంది. కట్ చేస్తే,ఇంతలో మల్లి కౌసల్య గౌతమ్ వసుంధర వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్లని చూసిన వసుంధర ఆగండి ఎందుకు వచ్చారు బయటికి పోండి అని అంటుంది.
గొడవ పడడానికి ఇది సమయం కాదు అని శరత్ అంటాడు. వీళ్లను నేను ఏ మాట అన్నా గొడవ పడ్డట్టేనా అసలు మీకు మనస్సాక్షి అనేది ఉందా అని వసుంధర అంటుంది.ఐదు నిమిషాలు ఆగితే వాళ్ల పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు వసుంధర అని శరత్ అంటాడు. దారుణంగా చంపించిన వాడే వచ్చి దండేసి దండం పెట్టి వెళ్ళిపోతే దాన్ని ఏమంటారు సానుభూత పరామర్శించడం ఏమంటారో చెప్పండి అని వసుందర కోపంగా అంటుంది.
నువ్వు ఏ ఆధారం చూసుకుని నా కొడుకుని అమానిస్తున్నావో తెలియదు కానీ నా కొడుకు నీ అల్లుడు నీ చంపలేదు అని కౌసల్య అంటుంది. తమ్ అరవింద్ ఫోటోకి దండేసి పూలు పెట్టి మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టి అరవింద్ నీవల్ల నాకు స్వప్న దూరమైంది అందుకు నీ మీద పగ ఉండేది నా భార్య జోలికొస్తే నేను చంపేస్తాను అనే మాట వాడకుండా ఉండాల్సింది ఆరోజు ఏదో ఆవేశంలో అన్నాను ఆ ఒక్క మాట పట్టుకొని వసుంధర అత్త నేనే నేరస్తుంనని అంటుంది నువ్వు ఏ లోకంలో ఉన్న నీ పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని అంటాడు గౌతమ్.మాలిని చనిపోయిన అరవింద్ ను తీసుకురాలేను కానీ అరవింద్ ను చంపిన వారిని మాత్రం నేను పట్టుకుంటాను అని గౌతమ్ అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది