Nindu Noorella Saavasam November 03 Episode 71: మేడం మీరు మళ్ళీ ఇదే స్కూల్ కి ప్రిన్సిపల్ గా వస్తారా ని నేను అసలు అనుకోలేదు చాలా హ్యాపీగా ఉంది మేడం మీరున్న స్కూల్లో కే మా పిల్లల్ని మళ్ళీ జాయిన్ చేస్తానని అనుకోలేదు అని అమరేంద్ర అంటాడు. నేను కూడా అనుకోలేదండి మా స్కూల్ ఫార్మాలిటీస్ ను బట్టి ముందు రోజు ఎగ్జామ్ పెట్టి అందులో పాస్ అయితే పిల్లని జాయిన్ చేసుకుంటాము అలాగే మీ చిన్న కూతురు మూడు రోజుల్లో జరగబోయే ఎగ్జామ్లో పాస్ అయితేనే జాయిన్ చేసుకుంటాము లేదంటే ఆ చిన్న అమ్మాయిని వేరే స్కూల్లో జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది అని ప్రిన్సిపాల్ మేడం అంటుంది. మేడం అంజు పాప గురించి మీరేం టెన్షన్ పడకండి మూడు రోజుల్లో జరగబోయే ఎగ్జామ్ కి నేను ప్రిపేర్ చేసి తనకు 100 మార్పు వచ్చేలా చేస్తాను ఆ బాధ్యత నాదండి అని భాగమతి ప్రిన్సిపాల్ తో అంటుంది.
అలాగే అమ్మ పాసు కాకపోతే మాత్రం వేరే స్కూల్ చూసుకోవాలి అని ప్రిన్సిపాల్ అంటుంది. తొందరపడి మాట జారావేమో మిస్సమ్మ అంజు కి ఎగ్జామ్ లో జీరో మార్బుల్ తప్ప ఎక్కువ వస్తే డాడీ ఎందుకు అంతలా ఫీలవుతారు అయ్యో మిస్సమ్మ తొందరపడి ఈ మాట జారావు ఇప్పుడేం చేస్తావు అని అము అంటుంది. ఏంటమ్మా ఇలా చేశావు డాడీ ఏదో ఒకటి మేనేజ్ చేసి నన్ను స్కూల్లో జాయిన్ చేసేవాడు నీవల్ల ఇప్పుడు నేను ఇప్పుడు చదవాల్సి వస్తుంది అని అంజు అంటుంది. అంజు పాపా అలా అంటావేంటి అమ్మ నిన్ను సేవ్ చేద్దామని అలా మాట్లాడాను అని భాగమతి అంటుంది. నువ్వు నన్ను సేవ్ చేయడానికి మాట్లాడినట్టు లేదు స్కూల్ లో నుంచి బయటికి పంపించేటట్టు మాట్లాడావు అసలే ప్రిన్సిపాల్ మేడంకి నేనంటే పడదు ఇప్పుడు ఎగ్జామ్ లో మార్పులు రాకపోతే నన్ను వేరే స్కూల్లో జాయిన్ చేస్తారు అంతా అని వల్లే మిస్సమ్మ అని అంజు కోపంగా అంటుంది.
సరే నాకు దాహం వేస్తుంది మంచినీళ్లు తాగి వస్తాను అని భాగమతి వెళ్ళిపోతుంది. ఇంతలో వాళ్ళ నాన్న కూడా మంచినీళ్లు తాగడానికి వస్తాడు. కానీ భాగమతి కి వాళ్ల నాన్న అక్కడికి వచ్చిన సంగతి తెలియక వెళ్లి మంచినీళ్లు తాగుదామని అనుకుంటుంది. భాగమతి వచ్చేలోపు వల్ల నాన్న మంచినీళ్లు తాగేసి వెళ్లిపోతాడు. స్కూల్లో పని చేసే అతను ఈయన ఎక్కడికి వెళ్లాడు ఇక్కడే ఉండమని చెప్పాను కదా అని భాగమతి దగ్గరికి వెళ్లి ఏమండీ ఇక్కడ ఒక పెద్దాయన ఉండాలి మీరు చూశారా అని అడుగుతాడు. లేదండి ఇక్కడ నాకు ఎవరూ కనిపించలేదు అయినా పెద్దాయన అంటున్నావు కదా ఈ డ్యూటీ చేయలేక వెళ్ళిపోయాడే మో అని భాగమతి అంటుంది. అంతేనంటావా ఆయన అలా చేసి ఉండరు అమ్మ ఎందుకంటే ఆయనకు ఆ ఉద్యోగం చాలా అవసరం అనుకుంటా ఆయనని చూస్తే అలా అనిపిస్తుంది అయినా పిల్లలు సరిగ్గా చూసుకుంటే ఆయనకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కాదమ్మా ఏంటో ఈ లోకం మనుషులు తల్లిదండ్రులని పట్టించుకోవట్లేదు అనుకుంటూ అతను వెళ్ళిపోతాడు. వెంటనే భాగమతికి వాళ్ళ నాన్న గుర్తుకు వచ్చి నాన్నకి ఇంటికి వెళ్లాక ఫోన్ చేసి మాట్లాడాలి అని అనుకుంటుంది.
మిస్సమ్మ ఎంతసేపమ్మా అని అంజు అంటుంది. వచ్చేసాను అంజు పాపా రండి వెళ్లి కారులో కూర్చుందాం అని పిల్లల్ని తీసుకుని భాగమతి వెళ్ళిపోతుంది. ఏంటయ్యా ఇక్కడే ఉండమని చెప్పాను ఎక్కడికి వెళ్లావు అని అతను అంటాడు. దాహం వేస్తే మంచినీళ్లు తాగడానికి వెళ్లాను బాబు అని భాగమతి వల్ల నాన్న అంటాడు. సరే రేపటి నుంచి డ్యూటీ కి రండి నీకు ఒక ఐడెంటి కార్డు ఇస్తాను అని అతను అంటాడు. చాలా సంతోషం బాబు వెళ్ళొస్తాను అని భాగమతి వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఏమయ్యా వెళ్లిన పని ఏమైంది ఉద్యోగం దొరికిందా అని భాగమతి వాళ్ళ పిన్ని అంటుంది. దొరికింది కానీ ఈ విషయం భాగమతికి చెప్పొద్దు అని వాళ్ళ నాన్న అంటాడు. అదేంటయ్యా భాగమతికి చెప్పకపోతే ఎలాగా నువ్వు ఇంటి దగ్గర లేనప్పుడు ఫోన్ చేస్తే ఏం చెప్పను అని వాళ్ళ ఆవిడ అంటుంది. మీకు అబద్ధాలు ఆడడం వచ్చు కదా ఏదో ఒకటి చెప్పు అని వాళ్ళ ఆయన అంటాడు. ఏంది అక్క బావ చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు ఏంటి అని వాళ్ళ తమ్ముడు అంటాడు.
డబ్బులు సంపాదిస్తున్నాడు కదరా అందుకే అలా పొగరుగా మాట్లాడుతున్నాడు అని వాళ్ళ అక్క అంటుంది. అక్క బావ మాట్లాడేది చూస్తుంటే నేను కూడా ఏదైనా పని చూసుకోవాలనిపిస్తుంది ఎక్కడో కాదక్కా భాగమతి పనిచేసే దగ్గర నేను పని చేస్తాను అని వాళ్ళ తమ్ముడు అంటాడు. నువ్వు భాగమతిని ప్రశాంతంగా ఉండనివ్వవారా అని వాళ్ళ అక్క అంటుది. మా ఇద్దరికీ పెళ్లి అయ్యేదాకా దాని వెనకాలే నేను ఉండాలి కదా లేకపోతే చేజారిపోతుంది అని వాళ్ళ తమ్ముడు అంటాడు. కట్ చేస్తే అమ్మగారు నాకు టాబ్లెట్ వేయరా అని నీలా అంటుంది. సరే ఉండు అని మనోహరి చిరాకు పడుతూ టాబ్లెట్ నోట్లో వేసి నీళ్లు పోస్తుంది. అమ్మగారు నన్ను బ్రతికించడానికి టాబ్లెట్ వేసినట్టుగా లేదమ్మా చంపేయడానికి వేసినట్టుంది అని నీలా అంటుంది. లేకపోతే ఏంటే నా టెన్షన్ లో నేను ఉంటే అమ్మగారు అమ్మగారు అంటూ నన్ను చంపేస్తున్నావు పొద్దున వాళ్ళు స్కూల్ కి వెళ్లారు ఇంకా రాలేదేంటి అని మనోహరి టెన్షన్ పడుతుంది.
ఇంతలో అమరేంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు. డాడీ నార్మల్ గా పాస్ అయితే సరిపోతుందా వందకి వంద తెచ్చుకోవాల ఎలాగో నాకు 90 మార్కులు వచ్చేస్తాయి ఇంకొంచెం కష్టపడితే 100 తెచ్చుకోవచ్చు మీకు ఎన్ని మార్కులు వస్తే సరిపోతాయా చెప్పండి నేను దాన్ని బట్టి చదువుతాను అని అంజు అంటుంది. చూసావా ఎంతగా చదివించాలో అర్థమైంది అనుకుంటా మూడు రోజుల్లో ఎగ్జామ్ ఉంది తనను బాగా ప్రిపేర్ చేయి అని అమరేంద్ర వెళ్ళిపోతాడు.ఈవిడ చదువు నా చావుకి వచ్చిందే అనుకుంటూ చిరాగ్గా లోపలికి వెళ్తుంది భాగమతి. అందరూ వచ్చారు ఈ బాలిక ఎక్కడ అని గుప్తా వెతుకుతాడు. ఏంటి గుప్తా గారు నా కోసం వెతుకుతున్నారా అని అరుంధతి అంటుంది. అవును బాలిక నువ్వు ఇంకా రాలేదేంటి నీకేమైనా అయిందా క్షేమంగా ఉన్నావా లేదా అని కంగారు పడుతున్నాను అని గుప్తా అంటాడు.
అది ఎందుకు అడుగుతావులే గుప్తా గారు ఎక్కడ మిస్సమ్మ చూస్తుందోనని టెన్షన్ తో చచ్చిపోతున్నాను ఇక్కడే ఉండి పిల్లల్ని చూసుకుంటున్నాను అని సంతోష పడాలా వాళ్లతో మాట్లాడలేకపోతున్నానే అని బాధపడాలో అర్థం కావట్లేదు అని అరుంధతి ఏడుస్తూ వెళ్లిపోతుంది. బాలిక నువ్వు నన్ను వెళ్ళనివ్వవు నువ్వు అచటికి రావు ఇప్పుడు ఏమి చేయవలెను అని గుప్త ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే అంజు ఏదో యుద్ధానికి వెళ్ళినట్టు బుక్కులన్ని ఇటు అటు విసిరేస్తు యోగా చేస్తూ ఎక్సర్సైజులు చేస్తూ బుక్స్ తీసి చదవడం మొదలు పెడుతుంది. అబ్బా ఇదేనా ఇలా బుక్స్ తీసి చదివేది అని ముగ్గురు తొంగి చూస్తూ ఉంటారు. నోరు ముయ్యండి లేకుంటే దోమలు దూర గలవు అని అంజు అంటుంది.అయ్యో అంజలి తల్లి నీకు ఎంత కష్టం వచ్చింది అని అరుంధతి అనుకుంటుంది. ఇంతలో భాగమతి అంజు పాపా చదువుతున్నావా అంటూ వస్తుంది. అయ్యో ఇప్పుడు చెల్లి నన్ను చూస్తే బాగోదు అని అరుంధతి మంచం కింద దాక్కుంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది