Nikhil Swayambhu: నిఖిల్ స్వయంభు మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో కార్తికేయ 2, స్పై మూవీ లతో పాన్ ఇండియా లెవెల్ ఆఫ్ స్టార్ హీరోగా మారిపోయిన నిఖిల్ ఇప్పుడు స్వయంభు తో మరోసారి ఐదు భాషల ప్రేక్షకులను మెప్పించేందుకు సై అంటున్నాడు. భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్నా ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందిస్తుండగా ఇందులో ఓ ఫైట్ సీన్ కోసమే ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తుంది. తాజాగా అనగా మే ఏడవ తారీకున ఈ మూవీ పోస్టర్ను నిఖిల్ రిలీజ్ చేశారు. అందులో అతడు ఓ వారియర్ గా కనిపించాడు. ఇక నిఖిల్ నటిస్తున్న ఈ మూవీ ఓ పిరియాడిక్ యాక్షన్ మూవీ. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతుంది.
ఇందులో ఒక ఫైట్ సీన్ కోసం ప్రత్యేకంగా రెండు భారీ చెట్లు వేశారు. ఇక ఈ మూవీలో గతంలో ఎన్నడూ చూడని విధంగా యుద్ధానికి సంబంధించిన ఓసిన్ తీయబోతున్నట్లు ఈ మూవీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ వార్ సీన్ లో ఏకంగా 700 మంది పాల్గొన్నారు. అందులో వియత్నం నుంచి తీసుకొచ్చిన ఫైటర్స్ కూడా ఉండడం విశేషం. 12 రోజుల పాటు ఈ సీన్స్ ను ప్రత్యేకంగా షూట్ చేశారు. ఇక దీనికోసం మేకర్స్ ఏకంగా 8 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో వారియర్గా కనిపిస్తున్న నిఖిల్ ఇందుకు తగినట్లుగా షూటింగ్ ప్రారంభానికి ముందే శిక్షణ తీసుకున్నాడు. ఈ చిత్రంలో అతడు కొన్ని కళ్ళు చెదిరే సాహసాలు చేయబోతున్నట్లు సమాచారం. ఆమధ్య బాహుబలి మూవీ లో రాజమౌళి తీసిన యుద్ధం సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇప్పుడీ స్వయంభు మూవీ లోని సీన్స్ కూడా అంతకు మించిన స్థాయిలో తీయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఎంతో ఆసక్తి రేపింది. బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్న యుద్దడిగా నిఖిల్ ఇందులో కనిపించాడు. అతని కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ మూవీ గా ఈ స్వయంభు మూవీ తెరకెక్కుతుంది. సంయుక్త మరియు నభ నటేష్ ఈ సినిమాలో నటిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా రిలీజ్ కానుంది.
ఇక గతంలో కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ మూవీ తెలుగులో కంటే నార్త్ లోనే బాగా ఆడింది. కలెక్షన్స్ కూడా బాగా రాబట్టింది. అదే జోష్లో నిఖిల్ ఆ తరువాత స్పై మూవీ ని కూడా పాన్ ఇండియా లెవెల్ లో తీసిన ఆ సినిమా దారుణంగా బోల్తా పడింది. దీంతో ఇప్పుడు స్వయంభు పై అతడి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం నిఖిల్ కి స్వయంభు మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా సూపర్ హిట్ కార్తీకేయ ఫ్రాంఛైజీ నీ కూడా ముందుకు తీసుకురాబోతున్నట్లు గతంలోనే వెల్లడించాడు. కార్తికేయ 3 కూడా రాబోతున్నట్లు రెండు నెలల క్రితమే అతడు అఫీషియల్ గా ప్రకటించాడు. ఇక ఒక పక్క సినిమాలలో దూసుకుపోవడమే కాకుండా మరోపక్క పాలిటిక్స్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్. తాజాగా నిఖిల్ తెలుగుదేశం పార్టీలో చేరాడు.
Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!