Chhattisgarh: చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మవోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని చత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు.
భద్రతా బలగాలు, యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కోసం వెళ్లిన సమయంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయని వివరించారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వివరించారు.
ఎన్ కౌంటర్ స్థలంలో ఇప్పటి వరకూ అయిదుగురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని భద్రతా సిబ్బంది సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. ఎన్ కౌంటర్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. కాగా, చత్తీస్ గఢ్ లో కొన్ని నెలలుగా నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్ల సంఖ్య పెరిగింది.
పలు ఎన్ కౌంటర్ లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. నక్సల్స్ పునరావాస కార్యక్రమం పునా నార్కోమ్ స్పూర్తితో చాలా మంది నక్సలైట్లు లొంగిపోయారు. కాగా, రాష్ట్రంలోని కంకేర్ జిల్లాలో ఏప్రిల్ 16న జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో దాదాపు 29 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చిన విషయం తెలిసిందే.
EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు