NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

సార్వత్రిక ఎన్నికల్లో ప్రపంచ రికార్డు సాధించిన భారత్ ..64.2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారన్న ఈసీ

సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించింది. మరి కొద్ది గంటల్లో వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం యావత్ భరతదేశం ఎదురు చేస్తొంది. ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా సోమవారం మీడియా సమావేశం నిర్వహించింది. ఎన్నికల ముగింపుపై ఈసీ ఇటువంటి సమావేశం నిర్వహించడం ఇదే ప్రధమం కావడం విశేషం.

మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ .. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ ను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో మన ప్రపంచ రికార్డు సృష్టించినట్లు వెల్లడించారు. జీ 7 దేశాల్లోని మొత్తం ఓటర్ల కంటే ఈ సంఖ్య 1.5 రెట్లు ఎక్కువ అని అన్నారు. ఐరోపా సమాఖ్యలోని 27 దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ కావడం విశేషమన్నారు. ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు పోటెత్తారనీ, 31.2 కోట్ల మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో మహిళా ఓటర్లకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.

85 ఏళ్లు పైబడిన ఓటర్లు ఇంటి వద్దే ఓటు వేశారన్నారు. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రీపోలింగ్ అవసరం రాలేదన్నారు గత ఎన్నికల్లో 540 చోట్ల రీపోలింగ్ నిర్వహించగా, ఈ సారి ఆ సంఖ్య 39 కు తగ్గిందన్నారు. ఇందులో కేవలం రెండు రాష్ట్రాల్లోనే 25 చోట్ల రీపోలింగ్ జరిగిందన్నారు. గత నాలుగు దశాబ్దాలతో పోలిస్తే జమ్మూకశ్మీర్ లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైందన్నారు. మొత్తం అక్కడ 58.58 శాతం ఓటర్లు తమ ఓటు హ క్కు వినియోగించుకున్నారన్నారు. కశ్మీర్ లోయలో 51.05 శాతం పోలింగ్ నమోదు అయ్యిందని చెప్పారు.

ఎన్నికల్లో నగదు ప్రవాహాన్ని విజయవంతంగా అడ్డుకున్నామని తెలిపారు. పది వేల కోట్ల విలువైన నగదు, కానుకలు, డ్రగ్స్, మధ్యాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ ఏజన్సీలు స్వాధీనం చేసుకున్నాయని వివరించారు. 2019 లో ఈ సంఖ్య రూ.3,500 కోట్లుగా ఉందన్నారు. ఈ ఎన్నికల సమయంలో సీ విజిల్ యాప్ లో 4.56 లక్షల ఫిర్యాదులు వచ్చాయని, వీటిలో 99.9 శాతం ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపార. ఇందులో 87.5 శాతం వాటిని వంద నిమిషాల్లోపే పరిష్కారం చూపామని చెప్పారు. డీప్ ఫేక్ వీడియోలను నిలువరించామని వెల్లడించారు.

Related posts

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N