YS Jagan: రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత మొదటి సారిగా ట్విట్టర్ వేదికగా ఆయన టీడీపీపై ఆరోపణలు చేశారు.
![YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్ 38](https://newsorbit.com/wp-content/uploads/2024/06/62.jpg)
ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహరం చేస్తున్నాయన్నారు. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకే ల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ సీపీ కి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు.
అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందని జగన్ విమర్శించారు. అయిదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని జగన్ విజ్ఞప్తి చేశారు. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు.