PM Modi: దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రముఖులు బరిలో ఉన్న స్థానాల్లో కౌంటింగ్ ఉత్కంఠను రేపుతోంది. వారణాసిలో ప్రధాన మంత్రి మోడీ ముందంజలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ తర్వాత 6223 ఓట్ల తో కాంగ్రెస్ అభ్యర్ధి అజయ్ రాయ్ అధిక్యంలో ఉండటంతో బీజేపీ శ్రేణులు నిరాశకు గురైయ్యారు.
![PM Modi: వారణాసిలో మళ్లీ ముందంజలో దూసుకువెళుతున్న ప్రధాని మోడీ 38](https://newsorbit.com/wp-content/uploads/2024/04/17-1.jpg)
ఆయితే ఆ తర్వాత రౌండ్లలో మోడీ అధిక్యత కొనసాగించారు. మోడీ దాదాపు 33వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. దీంతో భారీ మెజార్టీ ఖాయమని బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు. మరో పక్క దేశ వ్యాప్తంగా బీజేపీ నేతతృత్వంలోని ఎన్డీఏ ఆధిక్యత కొనసాగుతోంది. తొలుత ఇండియా కూటమి బలమైన పోటీ ఇచ్చినప్పటికీ దాదాపు 295 స్థానాల్లో ఎన్డీఏ లీడ్ లో కొనసాగుతోంది. ఇండియా కూటమి 219, ఇతరులు 29 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు.
నరేంద్ర మోడీ గత రెండు పర్యాయాలుగా ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పుడు మూడో సారి హాట్రిక్ పై కన్నేశారు. వారణాసిలో మోడీ విజయం నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు భావించారు. మరో పక్క కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం రాయబలేరి, వాయనాడ్ లలో భారీ మెజార్టీతో ముందంజలో కొనసాగుతున్నారు.