సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ నుండి నూతనంగా శాసన సభ్యులుగా ఎన్నికైన జాబితాను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా అందజేశారు.
సీఈవో ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో భారత ఎన్నికల సంఘం ప్రిన్సిఫల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అదనపు సీఈవో లు పి. కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్, కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, జాయింట్ సీఈవో ఎ.వెంకటేశ్వరరావు, సెక్షన్ ఆఫీసర్ రవీంధర్ కుమార్ తదితరులు గురువారం రాజ్ భవన్ లో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ను కలిశారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన శాసన సభ్యులుగా జాబితాను అందజేశారు. అనంతరం గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.