Naga Chaitanya: టాలీవుడ్ కింగ్ నాగార్జున తనయుడిగా, అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా ఇండస్ట్రీలోకి నాగచైతన్య అడుగుపెట్టాడు. 2009లో విడుదలైన జోష్ మూవీతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అయితే వాసు వర్మ డైరెక్ట్ చేసిన జోష్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఆ తర్వాత ఏడాది విడుదలైన `ఏ మాయ చేశావే` మూవీ భారీ విజయాన్ని నమోదు చేసింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కిన ఈ చిత్రం ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. దాంతో నాగ చైతన్య వెనక్కి తిరిగి చూసుకోలేదు.
100% లవ్, దడ, బెజవాడ, ఆటోనగర్ సూర్య, తడాఖా, మనం ఇలా వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే నాగచైతన్య స్టార్ అవ్వడానికి పరోక్షంగా సూపర్ స్టార్ మహేష్ బాబే కారణం అట. అసలు మహేష్ బాబు నాగచైతన్యకు చేసిన హెల్ప్ ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. నాగచైతన్య కెరీర్ లో ఏ మాయ చేశావే ఒక వండర్ ఫుల్ మూవీ. కార్తీక్ అనే యువ అసిస్టంట్ డైరెక్టరుకి, తనకంటే రెండేళ్ళు పెద్దదైన జెస్సీ అనే మలయాళ క్రిష్టియన్ అమ్మాయికి మధ్య నడిచిన అందమైన ప్రేమాయణం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.
తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళంలో శింబు, త్రిష జంటగా నటిస్తే.. తెలుగులో నాగచైతన్య, సమంత నటించారు. 2010 ఫిబ్రవరి 26న విడుదలైన ఈ సినిమా రెండు భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా యూత్ ను ఈ చిత్రం కట్టిపడేసింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఏ మాయ చేశావే సినిమా మహేష్ బాబు చేయాల్సిందట. అవును డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెలుగులో నాగ చైతన్య కన్నా ముందు మహేష్ బాబును హీరోగా అనుకున్నారు.
ఆయన్ను కలిసి కథ కూడా చెప్పారట. అయితే ఇటువంటి స్టోరీ తనకు సెట్ కాదని.. యువ హీరోలతో చేస్తే బాగుంటుందని మహేష్ బాబు సూచించారట. దాంతో గౌతమ్ మీనన్ అప్పుడే జోష్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్యను కలిసి స్టోరీ నెరేట్ చేశాడు. కథ నచ్చడంలో చైతు వెంటనే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఏ మాయ చేశావే భారీ విజయాన్ని సాధించడంతో నాగ చైతన్య హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. తెలుగు వారి హృదయాల్లో చోటు దక్కించుకున్నాడు. ఒక రకంగా మహేష్ బాబు ఏ మాయ చేశావే రిజెక్ట్ చేయడం నాగ చైతన్య కెరీర్ కు ఎంతగానో హెల్ప్ అయింది. చైతుకు స్టార్ హోదాను తెచ్చిపెట్టింది.