Madhuranagarilo February 16 2024 Episode 289: మనోహర్ ఫోటో చూపెడతాడు శ్యామ్. రుక్మిణి తో మాట్లాడుతూ ఉండగా తీశాను రా అని శ్యామ్ అంటాడు. పండు మనం ఇక ఇంటికి వెళ్దామా అని శ్యామ్ అంటాడు. కట్ చేస్తే, రాధా పండు గురించి ఆలోచిస్తూ ఉంటుంది.రాధా ఏం ఆలోచిస్తున్నావమ్మా పొద్దుటి నుంచి ఏమీ తినలేదు అన్నం తినమ్మా అని మధుర అంటుంది. నాకు వద్దు అత్తయ్య పండు ని చేచేతుల నేనే పాడు చేసుకున్నాను వాడు వచ్చేదాకా అన్నం తినను అని రాదా బాధపడుతుంది. ఏంటి రాదా అలా అంటావు నీ కడుపులో బిడ్డ కోస మైన ఆలోచించాలి కదా అని మధుర అంటుంది. కళ్ళ ముందు ఉన్న బిడ్డను దూరం చేసుకుని కడుపులో బిడ్డ కోసం అన్నం తినను అత్తయ్య పండు వచ్చేదాకా నేను అన్నం తినలేను వాడంటే నాకు ప్రాణం అని రాదా అంటుంది. పండు అంటే నీకు ప్రాణం అంటున్నావు మరి ఎందుకమ్మా వేరే వాళ్లకు అప్పజెప్పావు అని మధుర అంటుంది.
అలా జరుగుతుందని నేను అనుకోలేదు అత్తయ్య అని రాదా అంటుంది. ముక్కు మొహం తెలియని వాళ్ళకి బాబుని అప్పగించేటప్పుడు ఆలోచించాలి అని శ్యామ్ అంటాడు. కన్న బిడ్డ కన్నా మీ అక్కకు బంధువులే ఎక్కువైపోయారు అంటే దీన్నిబట్టి అర్థం అవ్వట్లేదా మీ అక్కకి పండు మీద ప్రేమ లేదు పండు కి తల్లి అవసరం లేదు రుక్మిణి కి కొడుకు అవసరం లేదు శ్యామ్ అంటాడు. బాబు గురించి ఏమైనా తెలిసిందా అని రాధా అంటుంది. పండు అని శ్యామ్ పిలుస్తాడు. డాడీ అంటూ పండు పరిగెత్తుకొస్తాడు. పండుని చూసినా రాదా పరిగెత్తుకెళ్ళి పండు ని హగ్ చేసుకుని ఏడిచి ముద్దులు పెట్టి ఇంకెప్పుడూ నన్ను వదిలిపెట్టి వెళ్ళకు నాన్న నేను ఇంకెప్పుడూ నిన్ను దూరం చేసుకోను అని ఏడుస్తుంది రాధా. రేయ్ పండు అంటూ మధుర కూడా పండుని హగ్ చేసుకుని ముద్దులు పెడుతుంది. పండు అని ధనంజయ్ సంతోషిస్తాడు. ఇంతకీ బాబు ఎక్కడ దొరికాడండి అని రాదా అంటుంది. ఎక్కడ దొరికితే నీకెందుకు పండు దొరికాడు కదా అని శ్యామ్ అంటాడు.
నాయనమ్మ నాకు ఆకలి వేస్తుంది అని పండు అంటాడు. పొద్దున ఎప్పుడు తిన్నావు ఏమో నాన్న ఆకలేస్తుందా రా తినిపిస్తాను అని మధుర అంటుంది. కట్ చేస్తే, మనోహర్ సిటీలో ఉన్న రౌడీలకి ఫోన్ చేసి పండు గురించి అడుగుతాడు వాళ్లు సిటీలో ఎవరు కిడ్నాప్ అవలేదు అని చెబుతారు. ఈ సిటీలో ఎవ్వరు కిడ్నాప్ అవలేదంట పండు కిడ్నాప్ కాలేదు అని మనోహర్ అంటాడు. అయితే ఇప్పుడు పండు దొరకడ అని రుక్మిణి బాధపడుతుంది. సిటీలో కిడ్నాప్ కాలేదు కాబట్టి బయట వాళ్ళు ఎవరో చేసి ఉంటారు వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పద అని మనోహర్ అంటాడు. ఇంతలో పండు నీ కిడ్నాప్ చేసిన వాళ్ళు కనపడగానే రుక్మిణి మనోహర్ వాళ్లే పండుని కిడ్నాప్ చేసింది అని చెప్తుంది. కట్ చేస్తే, బాబు ఎక్కడ అని మనోహర్ అడుగుతాడు. మాకేం తెలుసు సార్ అని వాళ్ళు అంటారు. నిన్న మీరే కదా పండు నీ కిడ్నాప్ చేసింది మర్యాదగా చెప్పండి లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని రుక్మిణి అంటుంది. నిన్న మేము కిడ్నాప్ చేసి తీసుకు వెళ్తూ ఉండగా వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్లాడు మేడం అని వాళ్ళు చెబుతారు. సరే మీరు వెళ్ళండి అని రుక్మిణి వాళ్ళని పంపించేస్తుంది.
శ్యామ్ పండు ని తీసుకువెళ్లి మళ్లీ ఏమీ తెలియనట్టు నాటకమాడి నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్లగొట్టాలని తనే పండుని కిడ్నాప్ చేశాడన్నమాట అని రుక్మిణి అంటుంది. శ్యాంసుందర్ నాకు షాక్ ఇచ్చావు కదా నీకు అంతకంటే గొప్ప షాకిస్తాను చూడు అంటూ రుక్మిణి ఫోన్ తీసి వీడియో ఆన్ చేస్తుంది. పండు నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న నీతో మాట్లాడే మాట ఇదే చివరిది అయి ఉండొచ్చు ఎందుకంటే నువ్వు లేకుండా నేను బ్రతకలేను నాన్న నిన్ను తీసుకురాకపోతే మీ నాన్న లోపలికి రానివ్వడు నువ్వు లేకుండా నేను ఇంటికి వెళ్ళలేను నీ మీద ప్రేమ లేదని నిందను భరిస్తూ
ఎలా బ్రతకను నాన్న అందుకే చనిపోతున్నాను అని రుక్మిణి అంటుంది. కన్నతల్లిని ఆయన నీకు దగ్గర కాలేకపోతున్నాను రాదే నిన్ను పెంచి పెద్ద చేసింది తనే ఇక అమ్మని జీవితాంతం బ్రతుకు నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు నాన్న అంటూ రుక్మిణి విషం తాగి ఇదే చివరి మాట ఇదే చివరి చూపు జాగ్రత్తగా ఉండు అంటూ రుక్మిణి స్పృహ తప్పి పడిపోతుంది. కట్ చేస్తే, సిస్టర్ నన్ను ఎందుకు బ్రతికించారు నన్ను చావనివ్వండి నేను బ్రతకలేను అని రుక్మిణి అంటుంది. ఇంతలో రాధా వచ్చి ఎందుకక్కా ఇలాంటి పిచ్చి పని చేశావు అని అంటుంది. సమయానికి ఎవరో చూసి హాస్పటల్లో జాయిన్ చేశారు కాబట్టి సరిపోయింది మేడం లేదంటే మీ అక్క ప్రాణాలు పోయేవి అని సిస్టర్ చెబుతుంది.
ఎందుకిలాంటి పని చేయాల్సి వచ్చిందో చూడు రాదా అని రుక్మిణి తను చేసిన వీడియోని చూపెడుతుంది. అది చూసి షాక్ అవుతుంది రాదా. పండు దొరకలేదని చనిపోవాలనుకుంటావా అక్క పండు కి ఇంత అన్యాయం చేస్తావా అని రాదా అంటుంది. కన్నది నేనే అయిన వాడిని పెంచి పెద్ద చేసింది నువ్వే కదా రాదా నువ్వే తల్లిగా ఉండే అర్హత ఉంది నాకు ఈ భూమ్మీద బతికే అర్హత లేదు బిడ్డను పోగొట్టుకొని ఇంకా నేనెందుకు బ్రతకాలి అని రుక్మిణి ఏడుస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!