Tenth Results: తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలైయ్యాయి. మంగళవారం బషీర్ భాగ్ లోని ఎస్సీఈఆర్టీ లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఎస్ఎస్సీ ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 91.31 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణులైయ్యారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఈ సారి కూడా బాలికలదే పై చేయి. బాలికలు 92.23 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత పొందారు.
ఫెయిల్ అయి విద్యార్ధులు ఎవరు ఆందోళన చెందవద్దని, వారు సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవచ్చని ఆయన సూచించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఫలితాల్లో 99.05 శాతంతో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 91,31 శాతం తో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. 3927 పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఆరు ప్రైవేటు పాఠశాలలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత. జిల్లా పరిషత్ గవర్నమెంట్ పాఠశాలల్లో 91.31 శాతం ఉత్తీర్ణత సాధించగా, తెలంగాణ గురుకులాల్లో 98.71 శాతం ఉత్తీర్ణత సాధించారు.
జూన్ 2 నుండి జూలై 13వ తేదీ వరకూ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. మార్కులపై విద్యార్ధులకు సందేహాలు ఉంటే రీ వాల్యూయేషన్, రీ వెరిఫికేషన్ కోసం 15 రోజుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
కాగా, రాష్ట్రంలో మార్చి 18వ తేదీ నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకూ టెన్త్ పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాశారు. వీరిలో రెగ్యులర్ విద్యార్ధులు 4,94,207 మంది, ప్రైవేటు గా 11,606 మంది హజరైయ్యారు. వీరిలో బాలురు 2,07,952 మంది, బాలికలు 2,50,433 మంది పరీక్షలు రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.
ఫలితాల కొరకు ఈ కింద లింక్ లను క్లిక్ చేసి చూడవచ్చు
http://results.bse.telangana.gov.in
http://results.bsetelangana.org