Dhe Celebrities: ఢీ షో.. ఇది ఇప్పుడు మొదలైన షో కాదు.. గత కొన్ని సంవత్సరాలుగా ఈ షో ఈటీవీ లో ప్రసారమవుతుంది. ఈ షో ద్వారా ఎంతోమంది వెలుగులోకి వచ్చి ప్రస్తుత కాలంలో స్టార్ కొరియోగ్రాఫర్లగా కూడా ఎదిగారు. అటువంటి వారిలో జానీ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్ కూడా ఒకరు. వీరిద్దరూ కూడా అదే స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేసి ఒకరితో జడ్జ్మెంట్ చెప్పించుకుని.. ఇప్పుడు వారు జడ్జ్ చేసే స్థాయికి ఎదిగారు. అంతలాగా ఈ షో ద్వారా వారికి పాపులారిటీ ఏర్పడింది. ఒకప్పుడు ఢీ షో అంటే ఓ స్పెషల్ అట్రాక్షన్ కింద నిలిచేది. కానీ సీజన్లో పెరుగుతున్న కొద్దీ ఎంటర్టైన్మెంట్ ఎక్కువయి డాన్సులు తక్కువగా ఉంటున్నాయి. ఒకప్పుడు డి సెలబ్రిటీస్ అంటే మొత్తం డాన్స్ ఏ ఉండేది.
కానీ ప్రస్తుత కాలంలో అలా కాదు. డాన్స్ నీ ఒక ఇంత చూపిస్తే ఎంటర్టైన్మెంట్ ని మాత్రం రెండింతలు చూపిస్తున్నారు. ప్రస్తుతం డి సెలబ్రిటీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ షోలో కేవలం టీవీ తారలు మాత్రమే పాటిస్పేట్ చేయాలి అనే రూల్ కూడా ఉంది. ఈ క్రమంలోనే పలువురు ఈ షోలో పాల్గొని మంచి గుర్తింపును సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిలో కార్తీకదీపం ఫెమ్ హిమ కూడా ఒకరు. ఈ బ్యూటీ చూడడానికి చిన్న పిల్ల అయినప్పటికీ డాన్స్ మాత్రం ఇరగదీస్తుంది. తన హుక్ స్టెప్పులతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. హిమ అసలు పేరు సహృద. ఈ బ్యూటీ డాన్స్ ముందు బుల్లితెర నటీనటుల డాన్స్ కూడా బలాదూర్ అని చెప్పుకోవచ్చు. అంత బాగా పర్ఫార్మ్ చేస్తుంది మరి ఈ బ్యూటీ. ఇక తాజాగా డీ సెలెబ్రెటీస్ నుంచి సహృద ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది.
ఈ విషయంపై స్వయంగా తానే స్పందిస్తూ ఒకరి వల్ల తాను ఎలిమినేట్ అయ్యాను అంటూ వెల్లడించింది. ఆమె తల్లి మాట్లాడుతూ.. ” నేనయితే సహృదను అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాను. ప్రతిసారి ఏడుస్తూ కూర్చుంటుంది. ఇక డి విషయానికి వస్తే అది ఒక ఫేక్ షో. నేను ముందుగానే వారితో మాట్లాడాను. సహృదకి స్ట్రాంగ్ కొరియోగ్రాఫర్ ని ఇవ్వమని. అప్పుడు వారు అందరూ ఒకటేనని చెప్పారు. నేను ఆ తరువాత ఇది నిజంగా జన్యు నా కాదా? లేదా ఎవరి దగ్గరైనా అగ్రిమెంట్ తీసుకుని వారిని ఫైనాన్స్ కి తీసుకెళ్తారా? అది ప్రతిదీ అడిగి నేను ఫోన్లో కూడా రికార్డ్ చేసుకున్నాను.
వారు జన్యునని చెప్పుకొచ్చారు. ఇక నాకేం అనిపించింది అంటే అంత జెన్యూన్ గా ఉన్నప్పుడు.. మరి అక్కడ ఓటింగ్స్ అనేవి.. మన కంటెస్టెంట్స్ కి ఎందుకు ఇచ్చారు. వారు ఎంత రాంగ్ గా ఓటింగ్ వేస్తున్నారంటే? మేబీ నాకు తెలిసి.. శ్వేత నాయుడు, ఆదర్శ్, వర్షిని ని ఫస్ట్ నుంచి ఒక టాప్ లో ఉంచాలని చూస్తున్నారు. ఎక్కువ ప్రయారిటీ కూడా ఇస్తున్నారు. అలాంటప్పుడు మిగతా వాళ్ళని తీసుకోకూడదు ” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆ తరువాత సహృద మాట్లాడుతూ..” ఢీ షో మొత్తం స్క్రిప్టెడ్. వారికి నచ్చిన వారిని మాత్రమే ముందుకు తీసుకువెళ్తారు. నచ్చని వారిని అక్కడితో ఎలిమినేట్ చేస్తారు. ఫస్ట్ లో నాకు ఢీ షో అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు చాలా చిరాకు ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.