గత రెండు వారాలుగా ఉస్మానియా సాధారణ ఆసుపత్రి పాత భవంతి గత రెండు వారాలుగా వార్తల్లో నిలుస్తూ వస్తోన్న విషయం తెల్సిందే. గత వారం వర్షాలు వచ్చినప్పుడు ఏకంగా ఆసుపత్రి వార్డుల్లోకి వర్షం నీరు వచ్చి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అటు వర్షపు నీరు, ఇటు కరోనా రోగులతో ఉస్మానియా ఆసుపత్రి పాత భవంతిలో అందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. కాస్త వర్షానికే ఇలా వర్షపు నీరు వార్డుల్లోకి వచ్చేస్తే ఇక పెద్ద వర్షం వస్తే పరిస్థితి ఏంటని రోగులు ప్రశ్నించారు. ఉస్మానియా సాధారణ ఆసుపత్రి పాత భవంతిని ఖాళీ చేయించారు. ఇప్పుడు దానికి సీల్ వేయబోతున్నారు. పాత భవంతిలో రోగులను మిగిలిన వార్డుల్లోకి షిఫ్ట్ చేసారు. కొన్నేళ్ల క్రితమే కేసీఆర్ ఉస్మానియాకు కొత్త భవంతిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.