కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్య కొరకు నిర్వహించాల్సిన ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన విషయం తెల్సిందే. ముందు ఏప్రిల్ లో నిర్వహించాల్సిన ఈ పరీక్షలను లాక్ డౌన్ కారణంగా జులై నెలాఖరు నుండి నిర్వహించాలని అనుకున్నారు. అయితే రీసెంట్ గా మరోసారి ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
విద్యా శాఖమంత్రి ఆదిమూలపు సురేశ్ కొన్ని రోజుల క్రితం మాట్లాడుతూ సెప్టెంబరు మూడో వారానికి ఈ ఎనిమిది సెట్లను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెల్సిందే. ఇప్పుడు ఈ సెట్లకు సంబంధించి తేదీలు ఖరారయ్యాయి. ఏపీ ఐసెట్ ను సెప్టెంబర్ 10, 11 తేదీలలో నిర్వహించనుంది ప్రభుత్వం. అలాగే ఇంజనీరింగ్ రెండో ఏడాదిలోకి ప్రవేశానికి నిర్వహించే ఈసెట్ ను సెప్టెంబర్ 14న నిర్వహించనున్నారు. ఇక ఏపీ ఎంసెట్ ను సెప్టెంబర్ 17 నుండి 25 వరకూ జరపనున్నారు.