బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారంలో డ్రగ్స్ కోణం వెలుగుచూసినప్పటి నుండి కేసు వివిధ మలుపులు తిరుగుతోన్న విషయం తెల్సిందే. ఈ వ్యవహారంలో ప్రధానంగా సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటోంది.
కేంద్రీయ దర్యాప్తు సంస్థ విచారణలో కొన్ని కీలక విషయాలు వెలుగు చూడగా డ్రగ్స్ కోణం బయటపడింది. గత నాలుగు రోజుల నుండి డ్రగ్స్ కోణంలో ఎన్సీబీ అధికారులు రియాను విచారిస్తున్నారు. డ్రగ్స్ వాడకాన్ని రియా ఒప్పుకోవడంతో ఇక ఆమె అరెస్ట్ తప్పదనే భావించారంతా. అయితే కొద్దిసేపటి క్రితం రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయిన విషయం తెల్సిందే.