తెలుగులో అక్కినేని నాగచైతన్యతో `సవ్యసాచి` చిత్రంలో నటించిన నిధి అగర్వాల్ తదుపరి చైతన్య సోదరుడు అఖిల్ అక్కినేనితో `మిస్టర్ మజ్ను` సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు నిధికి గుర్తింపునిచ్చాయే కానీ.. విజయాన్ని మాత్రం అందించలేకపోయాయి. అదే సందర్భంలో రామ్, పూరి జగన్నాథ్ల `ఇస్మార్ట్ శంకర్`లో నటించే అవకాశం రాగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఈ సొగసరి. `ఇస్మార్ట్ శంకర్` చిత్రంలో నిధి అగర్వాల్ సైంటిస్ట్గా కనపడనుంది. తన పాత్ర గురించి మాట్లాడుతూ “ఇండిపెండెంట్ అమ్మాయిగా కనపడతాను. కథ వినగానే వద్దని చెప్పడానికి కారణాలేమీ కనిపించలేదు. పాత్ర చేయడానికి ముందు కొన్ని పుస్తకాలు చదివాను. కొన్ని హాస్పిటల్స్కు వెళ్లాను. పాత్రను అవగతం చేసుకుని దానికి న్యాయం చేయడానికి నా వంతు కష్టపడ్డాను“ అంది నిధి అగర్వాల్.
previous post
next post