ప్రస్తుతం చైనా మీద అన్ని దేశాలు విరుచుకుపడుతున్నాయి. అన్ని దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ చైనా అన్ని దేశాలకు శత్రువుగా మారింది. తాజాగా చైనా, మరో ఘాతుకానికి పాల్పడేందుకు సిద్దమైనట్లు అమెరికా ఇంటలిజెన్స్ కు సమాచారం అందిందట.
అయితే, ఈసారి డ్రాగన్ దేశం అఫ్ఘానిస్థాన్ తో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. ఆఫ్గనిస్థాన్ లోని అమెరికా బలగాలపై దాడులకు చేసేందుకు ఆ దేశానికే చెందిన సంస్థలను ఉపయోగించుకుని కుట్ర పన్నాలని చైనా ఆదేశించిందట. ఇందుకు చైనా డబ్బులను కూడా చెల్లించేందుకు సిద్ధమైందని అమెరికా ఇంటలిజెన్స్ కు సమాచారం అందడంతో అమెరికన్ గవర్నమెంట్ అప్రమత్తమయ్యింది.
అమెరికాకు చెందిన ఓ ప్రముఖ వెబ్సైట్ లో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అమెరికా లోని ఏక్సియోస్ మీడియా కథనాల ప్రకారం “డిసెంబర్ 17న ట్రంప్తో అమెరికన్ ఇంటెలిజెన్స్ అధికారులు మాట్లాడారట”.
ఇంక ఈ పరిణామాలతో అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికన్ ఇంటిలిజెన్స్ సహాయంతో చైనా పన్నుతున్న ఈ కుట్రని తెలుసుకున్నామని మరియు ఈ కుట్రను బట్టబయలు చేస్తామని అమెరికా రక్షణ అధికారులు మీడియాతో చెబుతున్నారు.
మరోవైపు ఈ విషయమై చైనా చేస్తున్న వాదన మరో విధంగా ఉంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వెబిన్ స్పందిస్తూ, ఇదంతా తప్పుడు సమాచారమని మరియు తమ దేశాన్ని దెబ్బ తీసేందుకు జరుగుతున్న ప్రచారమని అంటున్నారు. అయితే కొన్ని వరాల క్రిందట రష్యా సైతం ఆఫ్ఘన్ సైన్యంతో కలిసి అమెరికా సైన్యాన్ని మట్టుబెట్టేందుకు సిద్దమైందని కొన్ని రిపోర్టులు వచ్చినా తరువాత మళ్ళి ఆ ఊసు లేదు.
ప్రస్తుతం చైనా పన్నుతున్న కుట్రలో రష్యా జోక్యం ఏమాత్రం లేదని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇక తాజాగా అధ్యక్షుడిగా ఎన్నికయిన జో బిడెన్ రష్యా మరియు చైనాల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారో వేచి చూడాలి.