Tollywood: తెలుగు పరిశ్రమ నూతనోత్తేజంతో ముందుకు కదులుతోంది. సినిమాల బిజినెస్ పరంగా తెలుగు మార్కెట్ స్థాయి ఏ రేంజ్ లో పెరిగిందో చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాలీవుడ్ కు గోల్డెన్ టైం నడుస్తోంది. ఈ క్రమంలో యువ హీరోలు కూడా పరిచయమై తమ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ యువహీరోల హవా నడుస్తోంది అనడంలో సందేహమే లేదు. దీనికి ఉదాహరణగా ఒక్క విజయ్ దేవరకొండ పేరు చెబితే సరిపోతుంది.
CM YS Jagan: జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం..గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి రానున్న మరో కొత్త సేవ
Tollywood: స్వింగ్ లో వున్న యువహీరోలు వీరే!
నవీన్ పోలిశెట్టి, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ వంటి హీరోలు ఈ కోవలోకి వస్తారు. వీరంతా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ప్రవేశించిన సంగతి అందరికీ తెలిసినదే. వీరు కేవలం నటనకే పరిమితం కాకుండా తమ ప్రతిభకి పని చెప్తూ స్టోరీకి సంబంధించిన విలువైన ఇన్ పుట్లని అందిస్తూ చిత్ర విజాయాల్లో తమ వంతు పాత్రని పోషించడం విశేషం. అడవి శేష్ పూర్తిగా ఈ కోవకి చెందుతాడు. ఆయన నటించిన గత చిత్రాలు ‘గూఢచారి’, ‘క్షణం’, ఎవరు? అనే సినిమాలే దీనికి ఉదాహరణ. శేష్ మొదటి సినిమా ‘కర్మ’ సినిమాకు అన్నీ తానై ముందుకు నడిపించడం తెలిసినదే.
Mohan babu: రాజకీయ సన్యాసం పుచ్చుకున్న మోహన్ బాబు?
వీళ్ళు కూడా మామ్ములోళ్లు కాదు!
‘పెళ్లి చూపులు’ సినిమా విషయంలో విజయ్ తరుణ్ భాస్కర్ కి స్క్రిప్ట్ విషయంలో సాయపడ్డాడట. అలాగే నవీన్ పొలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ విషయంలోను కూడా ఇదే జరిగిందట. నవీన్ ఏకంగా అసిస్టెంట్ డైరెక్టర్ చేయాల్సిన పనిని చేసేవాడట. ఇక వీరి బాటలోనే తాజా యువ హీరో సిద్దూ జొన్నలగడ్డ కూడా చేరిపోయాడట. సిద్ధూ తాజాగా నటించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి దర్శకుడు విమల్ కృష్ణతో కలిసి రచనా సహకారం చేసాడట. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టడం విశేషం.