Prabhas: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు గురించి సరికొత్త నిర్ణయం తీసుకొనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే కొత్త జీవో రానున్నట్లు ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. గతంలోనే టికెట్ ధరలకు సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్ తో చిరంజీవి, మహేష్, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణ మూర్తి, పోసాని, ఆలీ భేటీ కావడం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు సినిమా టికెట్ ధరలు పెంచుకునే విషయంలో ఏపీ ప్రభుత్వం నుండి జీవో రిలీజ్ కాలేదు. మరోపక్క మార్చి 11 వ తారీకు ప్రభాస్ నటించిన “రాధేశ్యాం” విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇటువంటి తరుణంలో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న ప్రభాస్ నీ.. ఏపీలో సినిమా టికెట్ ధరల విషయంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఈ విషయంపై చాలా సింపుల్ గా రియాక్ట్ అయ్యారు. తన సినిమా “రాదేశ్యాం” సినిమాకి విడుదలకు ముందే టికెట్ ధరలు పెరిగితే చాలా సంతోషం అంటూ ప్రభాస్ రియాక్ట్ అయ్యారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం… తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ప్రభాస్ కెరీర్లోనే హై బడ్జెట్ మూవీ. ఇటువంటి తరుణంలో మార్చి 11కి ముందే సినిమాకి సంబంధించి టికెట్ ధరలు పెంచుకునే రీతిలో ఏపీ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జీవో జారీ అయి సినిమా ఫస్ట్ డే పాజిటివ్ టాక్ సంపాదించుకుంటే.. “రాదేశ్యం” తిరుగులేని విజయం సాధిస్తుందని.. ఫ్యాన్స్ బయట టాక్. ఫస్ట్ టైం పూజా హెగ్డే తో ప్రభాస్ ప్రేమకథా నేపథ్యంలో సినిమా నటించడంతో.. రొమాంటిక్ తరహాలో ప్రభాస్ కనిపిస్తూ ఉండటంతో రాధేశ్యాం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.