ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో సినీ పరిశ్రమలో అనతి కాలంలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది. అయితే వీరి బంధం ఎక్కువ కాలం సజావుగా సాగలేదు. దాంతో వీరిద్దరూ కొద్ది నెలల క్రితమే విడాకులు తీసుకుని.. ఎవరి దారి వారు చూసుకున్నారు.
చైతూతో విడిపోయాక తన పూర్తి ఫోకస్ను కెరీర్పైనే మల్లించిన సామ్.. వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ను లైన్లో పెడుతూ దూసుకుపోతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా నిత్యం ఏదో ఒక పోస్ట్తో వార్తల్లో నిలిచేది. అలాంటి ఆమె గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయింది.
జులై 21న సమంత ఇన్స్టాగ్రామ్లో చివరగా పోస్ట్ చేసింది. మళ్లీ ఇంతవరకు ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. దీంతో అసలు సమంతకు ఏమైంది? ఎందుకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది..? అంటూ రకరకాల ప్రశ్నలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక సమంత సైలెన్స్ను భరించలేకపోతున్న అభిమానులు.. `వి మిస్ యూ సామ్.. ఎక్కడికి వెళ్లిపోయావ్`, `ప్లీజ్ సామ్ సోషల్ మీడియాలో దర్శనమివ్వు` అంటూ రిక్వెస్ట్లు పెడుతున్నారు.
మరి ఇప్పటికైనా సమంత మౌనం వీడితుందా.. లేదా.. అన్నది చూడాలి. కాగా, సమంత సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే ఈమె `శాకుంతలం`, `యశోద` చిత్రాలను పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడెక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ రెండు చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.