ప్రస్తుతం డిజిటల్ రంగానికి ప్రాధానత్య పెరుగుతోంది. వెండితెరపై స్టార్ యాక్టర్స్ ప్రస్తుతం డిజిటల్ రంగంలో నటించడానికి ఆసక్తిని చూపుతున్నారు. డిజిటల్ రంగంలో నటించడానికి ఏ మాత్రం అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు. ఇప్పటికే అక్షయ్కుమార్; అభిషేక్ బచ్చన్ వంటి స్టార్స్ సినిమాలతో పాటు డిజిటల్ రంగంలోనూ రాణిస్తున్నారు. వీరి బాటలోకి హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా అడుగుపెట్టారు. డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ నిర్మించే వెబ్ సిరీస్ `మిసెస్ సీరియల్ కిల్లర్`లో జాక్వెలిన్ నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. శిరీష్ కుందర్ దర్శకుడు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది.
previous post
next post