అమరావతి: సమాచర కమిషనర్ల నియామకం చంద్రబాబు అనైతికతకు పరాకాష్ఠ అని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురువారం ట్విట్టర్ వేదికగా విమర్శించారు. మరో 15 రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తుందనగా సమాచార కమిషనర్ల ఎంపికపై చంద్రబాబు ప్రభుత్వం గవర్నర్పై వత్తిడి తేవడం దారణమని విజయసాయి రెడ్డి అన్నారు.
ఐదేళ్లు నిద్రపోయి ఆఖరి నిమిషంలో కమిషనర్ల నియామకం జరపడం ఆయన అనైతికతకు పరాకాష్ఠ అని విజయసాయిరెడ్డి అన్నారు. నియామకాలను గవర్నర్ ఆమోదించకుండా కొత్త ప్రభుత్వానికి అవకాశమివ్వాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
మొన్న గాలి దుమారానికి హైకోర్టు అద్దాలు పగడలం, షెడ్లు ఏగిరిపోవడంపై చంద్రబాబుపై సెటైర్ వేస్తూ విజయసాయరెడ్డి విమర్శించారు.
‘తాత్కాలిక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి చాంబర్లోకి వర్షం నీళ్లు వరదలా కారితే మీరే రంద్రం పొడిపించారని ఆరోపించారు చంద్రబాబు. దర్యాప్తు కూడా జరిపించారు. ఇప్పుడు చిన్న పాటి గాలి వానకే హైకోర్టు అద్దాలు పగిలిపోయాయి. షెడ్లు ఎగిరి పోయాయి. ఇది ఈసి, చీఫ్ సెక్రటరీల కుట్ర అని చంద్రబాబు అంటారేమో’ అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.