Malli Nindu Jabili Episode 480: వసుంధర అత్తయ్యని శరత్ అంకుల్ ని విడగొట్టడానికి విడాకుల పేపర్ల మీద వసుంధర అత్తయ్యతో సంతకం చేయించాడు ఆ పేపర్లో ఇవి అని మల్లి కి అరవింద్ చూపెడతాడు. ఈ సమయంలో ఈ విడాకులు ఎందుకు అమ్మగారు అసలు ఎందుకు ఇలా సంతకం చేశారు నాకేమీ అర్థం కావట్లేదు అని మల్లి అంటుంది. అత్తయ్య తెలిసి పెట్టిందో తెలియక పెట్టిందో నాకు తెలియదు కానీ మీ అమ్మకు మంచి చేయబోయి అందరిని రోడ్డు మీద పడేస్తున్నాడు అని అరవిoద్ అంటాడు. అసలు ఈయన ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నాడు ఏమో నాకేం అర్థం కావట్లేదు అని మల్లి అంటుంది. గౌతమ్ వస్తున్నది గమనించిన అరవింద్ మంచం పక్కకు వెళ్లి దాక్కుంటాడు.
ఇంతలో గౌతమ్ వచ్చి మల్లి వెండి ప్రతిమలు కావాలనే పూజారి అంటున్నాడు వెళ్లి తీసుకురా అని గౌతమ్ అంటాడు. అత్తయ్య గారి రూమ్ అంతా వెతికానండి అవి కనిపించలేదు అని మల్లి అంటుంది. నేనే మర్చిపోయాను చెప్పాను కానీ ఇక్కడే మన కబోర్డ్ లో ఉన్న వెళ్లి తీసుకురా అని గౌతమ్ అంటాడు. సరే అని మల్లి వెండి ప్రతిమలు తీసుకువస్తూ ఉండగా అందులో ఒకటి కింద పడిపోతుంది. మల్లి చూసుకోవాలి కదా అని గౌతమ్ అంటాడు.నేను తీసుకొస్తాను లేండి అని మల్లి కింద పడదని తీసుకొని గౌతమ్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. అరవింద్ కూడా ఆ ఫైల్స్ ని తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మల్లి గౌతమ్ పూజ మీద కూర్చుంటారు. మా అమ్మ ఉండాల్సిన స్థానంలో నువ్వు ఉంటున్నావు దీనికి అంతకంత అనుభవిస్తావు అని మాలిని తన మనసులో అనుకుంటుంది. గౌతమ్ మల్లి కి కంకణం కడతాడు.
బాబు బొట్టు పెట్టుకొని అమ్మాయి కూడా బొట్టు పెట్టు అని పూజారి అంటాడు. గౌతమ్ తనకు తాను బొట్టు పెట్టుకొని మల్లి కూడా బొట్టు పెడతాడు. బాబు ఇప్పుడు అందరూ అక్షంతలు తీసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆవిడ దగ్గర వేయండి అని పూజారి అంటాడు. ఇoటి యజమాని వారి సతీమణి అమ్మవారికి పసుపు కుంకుమ సమ్మర్పించి హారతి ఇవ్వాలి లేవండి బాబు అని పూజారి అంటాడు. మల్లి లేచి అమ్మవారికి హారతిస్తూ అరవింద్ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని హారతి మీద చేయి పెట్టి అలాగే నిలబడుతుంది అప్పుడు చెయ్యి కాలుతుంది అప్పుడు మల్లి అమ్మ అని అరిచి హారతి కింద పడ వేస్తుంది హారతి కుంకుమ ప్లేటు మీద పడడంతో కుంకుమ పసుపు అంత వాళ్ళ ఇద్దరి ఒంటి మీద పడుతుంది. మల్లి నీ చేయి ఏమి కాలలేదు కదా అని మెల్లగా గౌతమ్ అడుగుతాడు.
ఇలా జరిగిందేంటి పంతులుగారు ఏదైనా అపశకునం జరుగుతుందా అని మీరా అంటుంది.అలాంటిది ఏమీ లేదమ్మా పూజకు మెచ్చి అమ్మవారే వాళ్ళిద్దరినీ పసుపు కుంకుమలతో అభిషేకించింది వాళ్ళు ఇద్దరు కలకాలం కలిసి ఉంటారు అని పూజారి అంటాడు. అందరూ పూజారి మాట వినగానే సంతోష పడిపోతారు. బాబు హారతి పూర్తి చేయకుండా బయటికి వెళ్ళకూడదు కాబట్టి మీరిద్దరూ మల్లి అమ్మవారికి హారతి ఇవ్వండి అని పూజారి అంటాడు. నా కూతురికి గౌతమ్ బాబు గారు భర్తగా దొరకడం మల్లి చేసుకున్న అదృష్టం అని మీరా సంతోష పడిపోతూ ఉంటుంది. మల్లి నీ భార్యగా పొందడం నా అదృష్టం కూడా అత్తయ్య ఈరోజు ఎంత మంచి జరిగిందో చూసావా అమ్మవారే మనలని ఏడేడు జన్మల వరకు కలిసి ఉంటారని దీవించింది మనల్ని ఎవరు విడదీయలేరు ఎప్పటికీ విడిపోము అని గౌతమ్ అంటాడు.
అందరూ కలిసి అమ్మవారికి హారతిస్తారు పూజ సంపూర్ణమైపోతుంది.అమ్మ వీళ్లిద్దరూ మాత్రం సంతోషంగా ఉన్నారు నేను మా అమ్మ ఏం నేరం చేశామని బాధపడుతున్న మా డాడీ నాతో వస్తే బాగుంటుంది వచ్చేలా చెయ్యమ్మా అని మాలిని తన మనసులో అమ్మవారిని వేడుకుంటుంది. కట్ చేస్తే ఒక ఆవిడ మల్లి కి గిఫ్ట్ తెచ్చి ఇస్తుంది ఎవరిచ్చారు అంటే ఎవరో అమ్మ పంపించారు నీకే ఇవ్వమని ఇచ్చారు అని ఆవిడ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇంతలో ఆ గిఫ్ట్ పంపించిన ఆవిడే మల్లి కి ఫోన్ చేస్తుంది. మల్లి ఫోన్ ఎత్తి హలో ఎవరు అని అంటుంది. చెప్తా చెప్తా జరంత టైం ఈ బిడ్డ నేనే నీకు గిఫ్ట్ పంపించాను ముందు ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూడు తర్వాత మనం ముచ్చట్లు పెట్టుకుందాం గానీ అని ఆవిడ ఫోన్ కట్ చేస్తుంది. మల్లి గిఫ్ట్ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.