MP Vijayasai Reddy: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు, మద్యం వ్యాపారంపై విమర్శలు చేయడంతో పాటు కేంద్ర మంత్రికి పిర్యాదుకు చేశారు. రీసెంట్ గా మద్యం కుంభకోణం వెనుక వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు ఉన్నట్లు తీవ్ర ఆరోపణలు కూడా చేశారు పురందేశ్వరి.
ఈ ఆరోపణలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను లిక్కర్ తాగను, నాన్ వెజ్ తినను, ఆమె మద్యం సేవిస్తారేమో తనకు తెలియదు, ఏమేం బ్రాండ్ లు ఉంటాయో కూడా తనకు తెలియదు, ఆమె ఆ విషయం తెలుసుకుని మాట్లాడితే బాగుండేది అని అన్నారు విజయసాయి రెడ్డి. పురందేశ్వరి తన కుమారుడు హితేశ్, గీతం యూనివర్శిటీ భరత్ తో పాటు లిక్కర్ సిండికెట్ బ్రోకర్ చెప్పిన మాటలు విని తన మీద, మిథున్ రెడ్డి మీద ఆధారాలు లేకుండా మద్యం ఆరోపణలు చేయడం తగదని అన్నారు. పురందేశ్వరి నిలకడ లేని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
పురందేశ్వరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2004లో బాపట్ల పార్లమెంట్, 2009లో విశాఖ, 2014లో రాజంపేట, 2019లో విశాఖ నుండి పోటీ చేసిన విషయాల దృష్టి లో పెట్టుకుని ఆమెకు ఒక నియోజకవర్గం అంటూ లేని వ్యక్తి అని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. కుటుంబ ఎజెండాతోనే ఆమె రాజకీయం చేస్తున్నారని అన్నారు. అన్ని అధారాలతోనే చంద్రబాబు అరెస్టు జరిగిందని పేర్కొన్నారు. లోకేశ్ కు నాయకుడి లక్షణాలు లేవని విజయసాయి రెడ్డి విమర్శించారు. పురందేశ్వరి చేసిన పనులు తాను బయటపెడితే ఆమె ఎక్కడ ఏం చేసుకుంటారో తెలియదనీ, అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని విజయసాయి హెచ్చరించారు.
Telangana TDP: తెలంగాణలో టీడీపీ ఒంటరిగానే పోటీ .. క్లారిటీ ఇచ్చేసిన కాసాని